English | Telugu

క్రిస్టమస్ కి 'ముకుంద' వస్తున్నాడు

ఈతరం కుర్రాళ్ల భావోద్వేగాలు, జీవితం పట్ల వాళ్లకుండాల్సిన స్పష్టత ప్రధానాంశాలుగా పట్టణ నేపథ్యంలో సాగే చిత్రం 'ముకుంద'. మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తే్జ్ హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. 'కొత్త బంగారు లోకం', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకున్న శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు సమర్పణలో లియో ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కోసం ప్రస్తుతం హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడాలో 'అరరే చంద్రకళా... జారెనా కిందకిలా..' అనే పాటను చిత్రీకరిస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ - "సిరివెన్నెల సీతారామశాస్ర్తి రాసిన ఈ పాటను వరుణ్ తేజ్, పూజా హెగ్డేలపై చిత్రీకరిస్తున్నాం. ఈ పాటకు రాజు సుందరం నృత్యరీతులు సమకూరుస్తున్నారు. సోమవారంతో ఈ పాట షూటింగ్ పూర్తవుతుంది. ఈ చిత్రానికి మిక్కీ జె.మేయర్ పాటలు స్వరపరిచిన విషయం తెలిసిందే. ఇటీవల విడుదల చేసిన పాటలకు మంచి స్పందన లభిస్తోంది. స్వరాలు మాత్రమే కాదు... సాహిత్యం గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు. ఈ నెల 24న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని చెప్పారు.

దర్శకుడు మాట్లాడుతూ - ''నా గత రెండు చిత్రాలు ఫీల్ గుడ్ మూవీస్. కానీ, ఇది యాక్షన్ ఓరియంటెడ్ మూవీ. చాలా ఎనర్జిటిక్ గా ఉంటుంది. వరుణ్ కి నప్పే కథ. అందుకే నా అంతట నేనే తనని హీరోగా అడిగాను. వరుణ్ తేజ్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. మామూలుగా ఇప్పటివరకు గ్రామీణ నేపథ్యంలోనూ, నగర నేపథ్యంలోనూ చాలా సినిమలు వచ్చాయి. కానీ, పట్టణ నేపథ్యంలో తక్కువ సినిమాలు వచ్చాయి. ఇది, పట్టణాల్లోని యువతరం భావోద్వేగాలు, అక్కడి రాజకీయాలు నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ఇది పక్కా యాక్షన్ ఓరియంటెడ్ యూత్ ఫుల్ మూవీ. నిర్మాతలు ఏ విషయంలోనూ రాజీపడలేదు'' అని చెప్పారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.