English | Telugu

బంపరాఫర్.. ఒక టికెట్ పై ఇద్దరికి సినిమా చూసే ఛాన్స్!

రక్షిత్ అట్లూరి, అపర్ణ జనార్థన్, సంకీర్తన విపిన్ హీరో హీరోయిన్స్ గా నటించిన మూవీ "నరకాసుర". సుముఖ క్రియేషన్స్, ఐడియల్ ఫిలిం మేకర్స్ బ్యానర్స్ లో డాక్టర్ అజ్జా శ్రీనివాస్ నిర్మించిన ఈ చిత్రానికి సెబాస్టియన్ నోవా అకోస్టా జూనియర్ దర్శకత్వం వహించారు. నవంబర్ 3న విడుదలైన నరకాసుర మంచి టాక్ నే తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో సక్సెస్ మీట్ నిర్వహించి, తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు మూవీ టీమ్. సోమవారం నుంచి ఈ సినిమాను థియేటర్స్ లో ఒక టికెట్ పై ఇద్దరు ప్రేక్షకులు చూసే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు.

సక్సెస్ మీట్ లో హీరో రక్షిత్ అట్లూరి మాట్లాడుతూ, "నరకాసుర సినిమాకు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. రక్షిత్ బాగా నటించాడు, ఈ సినిమాతో నటుడిగా మరో మెట్టు ఎక్కాడనే ప్రశంసలు వస్తున్నాయి. ప్రేక్షకుల నుంచి అప్రిషియేషన్స్ తో పాటు మీడియా నుంచి మంచి రివ్యూస్ వస్తున్నాయి. మా సినిమాలో మెసేజ్ మరింత మంది ప్రేక్షకులకు రీచ్ అవ్వాలని మండే నుంచి థర్స్ డే వరకు ఒక టికెట్ మీద ఇద్దరు ప్రేక్షకులు సినిమా చూసేందుకు అవకాశం కల్పిస్తున్నాం. నరకాసుర వంటి మంచి సినిమాను థియేటర్స్ లో చూడండి, ఈ ప్రయత్నంలో మమ్మల్ని గెలిపిస్తారని ఆశిస్తున్నా. అన్నారు.

దర్శకుడు సెబాస్టియన్ మాట్లాడుతూ, "మా నరకాసుర సినిమాను పెద్ద హిట్ చేసిన ఆడియెన్స్ కు థ్యాంక్స్ చెబుతున్నాం. సినిమా చూసిన వాళ్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. మీడియా రివ్యూస్ చాలా పాజిటివ్ గా ఉన్నాయి. కొందరు పర్సనల్ గా నాకు సినిమా ఆకట్టుకుందని మెసేజ్ లు పంపుతున్నారు. సినిమా బాగుందని చెప్పడమే కాదు మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, యాక్టర్స్ పర్ ఫార్మెన్స్, ఫైట్స్..ఇలా ప్రతి క్రాఫ్ట్ వర్క్ బాగుందని ప్రశంసలు వస్తున్నాయి. ట్రాన్స్ జెండర్స్ ను చిన్న చూపు చూడకూడదు మనుషులంతా ఒక్కటే అని మేము ఇచ్చిన సందేశం ప్రేక్షకులకు రీచ్ అవుతోంది. ఇది మరింత మంది ప్రేక్షకులకు చేరేలా వచ్చే సోమవారం నుంచి గురువారం వరకు ప్రతి థియేటర్ లో ఒక్కో టికెట్ పై ఇద్దరు ప్రేక్షకులు సినిమా చూడొచ్చు. రక్షిత్ పర్ ఫార్మెన్స్ ఇంప్రెసివ్ గా ఉందంటున్నారు. ఈ మూవీ జర్నీలో నాకు సపోర్ట్ చేసిన మా ప్రొడ్యూసర్, ఇతర టీమ్ మెంబర్స్ అందరికీ థ్యాంక్స్. అన్నారు.

నిర్మాత డాక్టర్ అజ్జా శ్రీనివాస్ మాట్లాడుతూ, "నరకాసుర మూవీతో మా బ్యానర్ సుముఖ క్రియేషన్స్ కు మంచి పేరొచ్చింది. సినిమా చూసిన వాళ్లంతా మంచి మూవీ చేశారంటూ ప్రశంసిస్తున్నారు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయని అంటున్నారు. విదేశాల నుంచి మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి అప్రిషియేట్ చేస్తున్నారు. రక్షిత్ తో పాటు హీరోయిన్స్, ఇతర కీ ఆర్టిస్టుల పర్ ఫార్మెన్స్ ఆకట్టుకుందని అభినందిస్తున్నారు. నరకాసుర చూడని వాళ్లు థియేటర్స్ కు వెళ్లండి, ఈ సినిమాలోని మంచి మెసేజ్ ను ఇతరులకు చెప్పండి. మా సంస్థలో గుర్తుండిపోయే సినిమా చేసిన డైరెక్టర్ సెబాస్టియన్ గారికి థ్యాంక్స్." అన్నారు.

హీరోయిన్ అపర్ణ జనార్థన్ మాట్లాడుతూ, "ప్రేక్షకుల ఆదరణ వల్లే మేము ఈ వేదిక మీద ఉండగలిగాం. నరకాసుర సినిమాకు మీరు చూపిస్తున్న ఆదరణకు థ్యాంక్స్. మా సినిమా టీజర్ రిలీజ్ నుంచి సినిమా రిలీజ్ వరకు సపోర్ట్ చేసిన వారందరికీ థ్యాంక్స్. నరకాసుర చూడని వారు తప్పకుండా థియేటర్స్ కు వెళ్లండి." అన్నారు.

హీరోయిన్ సంగీర్తన విపిన్ మాట్లాడుతూ, "నరకాసుర మూవీకి థియేటర్స్ లో హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. మా మూవీ సూపర్ హిట్ చేసిన అందరికీ థ్యాంక్స్. ఈ జర్నీ మాకెంతో స్పెషల్. కష్టపడిన సినిమాకు తప్పకుండా ఫలితం దక్కుతుంది అనేందుకు మా మూవీ లేటెస్ట్ ఎగ్జాంపుల్. నాకు ఈ సినిమా జర్నీలో సపోర్ట్ చేసిన టీమ్ కు థ్యాంక్స్. నరకాసుర మూవీ చూడని వారు థియేటర్స్ కు వెళ్లమని కోరుతున్నా." అన్నారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.