English | Telugu

దసరా బరిలో టైగర్.. బాలయ్య, బోయపాటితో వార్!

మాస్ మహారాజా రవితేజ త్వరలో 'రావణాసుర' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ చిత్రం ఏప్రిల్ 7న విడుదల కానుంది. ఇది విడుదలైన కొన్ని నెలలకే మరో చిత్రంతో అలరించనున్నాడు రవితేజ. ఆయన హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'టైగర్ నాగేశ్వరరావు'. అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌ లో రూపొందుతోన్న ఈ సినిమాకు వంశీ దర్శకుడు. స్టూవర్టుపురం దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై ప్రకటన వచ్చినప్పటి నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు మేకర్స్.

'టైగర్ నాగేశ్వరరావు' చిత్రాన్ని దసరా కానుకగా 2023, అక్టోబర్ 20న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే ఇప్పటికే దసరా బరిలో రామ్ పోతినేని, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం నిలిచింది. ఈ సినిమాని అక్టోబర్ 20 న రిలీజ్ చేస్తున్నట్లు ఇటీవల అనౌన్స్ చేశారు. మరోవైపు నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి కలయికలో రానున్న 'NBK 108'(వర్కింగ్ టైటిల్) చిత్రాన్ని సైతం దసరాకే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అదే జరిగితే ఈ ఏడాది దసరాకు త్రిముఖ పోరు తప్పదు. మరి ఈ పోరులో ఏ సినిమా పైచేయి సాధిస్తుందో చూడాలి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.