English | Telugu

ప్రభాస్ ఫ్యాన్స్ కి ఉగాది స్పెషల్ పండుగనా! 

పాన్ ఇండియా స్టార్ 'ప్రభాస్'(Prabhas)ప్రస్తుతం'ది రాజాసాబ్'(The Raja saab)హను రాఘవపూడి(Hanu Raghavapudi)సినిమాల షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.ఈ రెండు చిత్రాల్లో 'రాజాసాబ్' ముందుగా ప్రేక్షకుల ముందుకు రానుంది.చిత్ర బృందం ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రభాస్ లుక్స్, టీజర్ ఒక లెవల్లో ఉండటంతో, అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా 'రాజాసాబ్' పై భారీ అంచనాలు ఉన్నాయి.పైగా వింటేజ్ ప్రభాస్ కనిపించబోతుండటంతో,ఎప్పుడెప్పుడు 'రాజాసాబ్' థియేటర్స్ లోకి వస్తాడా అని ఎదురుచూస్తున్నారు.

ఇక ఈ మూవీ ఏప్రిల్ 10 న రిలీజ్ అవుతుందని తొలుత మేకర్స్ అధికార ప్రకటన చేసారు.కానీ కొన్ని కారణాల వల్ల రిలీజ్ డేట్ వాయిదా పాడింది.దీంతో కొత్త రిలీజ్ డేట్ కోసం అభిమానులు,ప్రేక్షకులు ఎదురుచూస్తూ ఉన్నారు.కానీ లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఉగాది కానుకగా కొత్త రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తారనే ప్రచారం సినీ సర్కిల్స్ లో జరుగుతుంది.

'రాజాసాబ్' కి మారుతి(Maruthi)దర్శకతం వహిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై విశ్వప్రసాద్(Viswaprasad)అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నాడు.ప్రభాస్ సరసన నిధి అగర్వాల్(Nidhhi Agerwal)మాళవిక మోహన్(Malavika Mohanan)హీరోయిన్లుగా చేస్తుండగా థమన్(Thaman)సంగీతాన్ని అందిస్తున్నాడు.ప్రభాస్ డ్యూయల్ రోల్ లో కనిపిస్తున్నాడనే టాక్ అయితే ఉంది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.