English | Telugu

Kedar Selagamsetty : ప్రముఖ నిర్మాత కన్నుమూత.. సుకుమార్ కి అడ్వాన్స్ ఇచ్చి...

తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. నిర్మాత కేదార్ సెలగంశెట్టి(Producer Kedar) దుబాయ్ లో కన్నుమూశారు. ఆయన మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన 'గంగం గణేశా' సినిమాను కేదార్ నిర్మించారు. అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, బన్నీ వాసులకు సన్నిహితుడుగా ఆయనకు సినీ పరిశ్రమలో పేరుంది. అలాగే, విజయ్ దేవరకొండతో ఓ భారీ సినిమా తీయడం కోసం సుకుమార్ కు అడ్వాన్స్ ఇచ్చి ఉన్నారు. ఇలా నిర్మాతగా భారీ లక్ష్యాలతో ముందుకు వెళ్తున్న కేదార్ మృతి చెందడం ఇండస్ట్రీని, సన్నిహితులను షాక్ కి గురి చేసింది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.