English | Telugu

ఓజీ అలా.. రాజా సాబ్ ఇలా.. ఎందుకిలా..?

రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీ 'ది రాజా సాబ్' (The Raja Saab). పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ హారర్ కామెడీ ఫిల్మ్, 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీ నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ చిత్ర ట్రైలర్ ను సెప్టెంబర్ 29 సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ అనౌన్స్ మెంట్ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. (Raja Saab Trailer)

ఈ మధ్య కాలంలో చిత్ర విడుదల తేదీకి రెండు మూడు వారాల ముందు కూడా పెద్ద సినిమాల ట్రైలర్లు రావట్లేదు. ముఖ్యంగా ఇటీవల పవన్ కళ్యాణ్ 'ఓజీ' మూవీ ట్రైలర్ అయితే.. రిలీజ్ డేట్ కి సరిగ్గా మూడు రోజల ముందు వచ్చింది. అలాంటిది విడుదల తేదీకి ఏకంగా మూడు నెలల ముందుగానే 'రాజా సాబ్' ట్రైలర్ వస్తుండటం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఇంత త్వరగా ట్రైలర్ విడుదలవుతుండటంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ ఉన్నారు.

Also Read:200 కోట్ల క్లబ్ లో ఓజీ.. పవర్ స్టార్ మాస్ ర్యాంపేజ్...

కాగా, అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు కానుకగా 'రాజా సాబ్' నుంచి సాంగ్ ని కూడా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్, సంజయ్ దత్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.