English | Telugu

చరణ్ బాబు.. తండ్రిగా నేను నిన్ను చూసి గర్వపడుతున్నా!

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) తెలుగు తెరకు పరిచయమై నేటితో 18 ఏళ్ళు పూర్తయింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ నిర్మించిన రామ్ చరణ్ మొదటి చిత్రం 'చిరుత' 2007 సెప్టెంబర్ 28న విడుదలైంది. నేటితో చరణ్ సినీ ప్రయాణం మొదలై, 18 వసంతాలు పూర్తయిన సందర్భంగా.. ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. చిరంజీవి కూడా సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని పంచుకున్నారు. (18 Years Of Ram Charan)

"చరణ్ బాబు,18 ఏళ్ల క్రితం ‘చిరుత’తో మొదలైన నీ సినీ ప్రయాణం, నేడు కోట్లాది అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచినందుకు ఎంతగానో సంతోషిస్తున్నాను. నిన్ను తెరపై హీరోగా చూసిన ఆ క్షణం.. నాన్నగా నేను ఎప్పటికీ మరచిపోలేను. నీ క్రమశిక్షణ, కృషి, పట్టుదల, వినయం, అంకితభావం నిన్ను ఇండస్ట్రీలో మరింత ప్రత్యేకంగా నిలబెట్టాయి. తండ్రిగా నేను నిన్ను చూసి ఎప్పుడు గర్వపడుతుంటా.. తెలుగు ప్రేక్షకుల అభిమానంతో, దేవుని దీవెనలతో మరెన్నో శిఖరాలు నువ్వు అధిరోహించాలి అని కోరుకుంటూ.. విజయోస్తు…" అని చిరంజీవి రాసుకొచ్చారు.

చిరంజీవి తనయుడిగా 'చిరుత'తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్.. రెండో సినిమా 'మగధీర'తో ఇండస్ట్రీ హిట్ కొట్టి, తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. ఇక 'ఆర్ఆర్ఆర్'తో గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు. తనయుడు చరణ్ ఎదుగుదల చూసి తండ్రిగా గర్వపడుతున్న చిరంజీవి.. తన ఆనందాన్ని అక్షరాల రూపంలో ఇలా అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.