English | Telugu

పవర్ స్టార్ కు తమ్మారెడ్డి ప్రశంసలు

పవన్ కళ్యాణ్ త్వరలో కొత్త పార్టీ పెట్టబోతున్నాడని, రాజకీయాల్లోకి రాబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ విషయం పలు భిన్న అభిప్రాయాలు వస్తున్నాయి. అయితే పవన్ రాజకీయ వార్తలపై ప్రముఖ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ... "పవన్ కళ్యాణ్ ఇప్పుడు పార్టీ పెట్టడం సరైనది కాదు. ఒకవేళ ఒక 10నెలల ముందు పెట్టి ఉంటే, ఇప్పటికే మంచి సభ్యులను ఎన్నుకొని ప్రజలకు సేవ చేసే అవకాశం ఉండేది. కానీ ఇపుడంతా కూడా రాజకీయాల్లో తమకు సీట్లు దొరకకపోతే ఒక పార్టీ నుండి మరొక పార్టీకి జంప్ చేసేవాళ్ళు, ఇప్పటి వరకు ఉన్న పార్టీలో ఉండి లంచాలు, మోసాలు చేసిన వాళ్ళు వచ్చి ఈ కొత్త పార్టీలో చేరే అవకాశం ఉంది. లేదంటే గతంలో ప్రజారాజ్యం పార్టీలో మిగిలిపోయిన వారే ఇందులో చేరే అవకాశం ఉంది. కాబట్టి.. పవన్ ఈ సమయంలో రాజకీయాలకు రాకపోవడమే మంచిది. ఎందుకంటే అతనికి ప్రజల్లో మంచి పేరుంది. ఒక క్లీన్ సర్టిఫికేట్ ఉన్న వ్యక్తి. కనుక మళ్ళీ పార్టీ పెట్టి తప్పుడు నిర్ణయం తీసుకోవడం కన్నా రాజకీయాల్లోకి రాకపోవడమే మంచిది." అని అన్నారు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.