English | Telugu

మహాదేవనాయుడుగా నందమూరి బాలకృష్ణ

"మహాదేవనాయుడు"గా నందమూరి బాలకృష్ణ నటిస్తున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే శ్రీ కీర్తి కంబైన్స్ పతాకంపై, యువరత్న నందమూరి బాలకృష్ణ హీరోగా త్రిపాత్రాభినయం చేస్తూండగా, లక్ష్మీ రాయ్, సలోని, ఛార్మి హీరోయిన్లుగా, పరుచూరి మురళి దర్శకత్వంలో, యమ్.యల్.కుమార్ చౌదరి ఒక చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఏం పేరు పెడతారాని అంతా ఎదురు చూస్తుండగా, కీర్తి కంబైన్స్ బ్యానర్ మీద "మహాదేవనాయుడు" అనే టైటిల్ ని రిజిస్టర్ చేశారని ఫిలిం నగర్ వర్గాల ద్వారా అందిన సమాచారం.

ఆ టైటిల్ ఒక్క నందమూరి బాలకృష్ణకే సరిగ్గా సరిపోతుందనీ, అది ప్రస్తుతం కీర్తి కంబైన్స్ బ్యానర్ లో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న సినిమాలో తాతయ్య పాత్ర పేరనీ అంటున్నారు. అంటే ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ తాత, కొడుకు, మనవడుగా త్రిపాత్రాభినయంలో నటిస్తున్నారట. తాత "మహాదేవనాయుడు" పాత్ర ఫ్యాక్షనిస్టు అయితే తండ్రి పాత్ర పెద్దమనిషిగా ఉంటాడట. మనవడు పాత్రలో జర్నలిస్ట్ గా నటిస్తున్నాడట. ఈ మూడు పాత్రలూ ఒకదానితో ఒకటి పోటీపడతాయని ఫిలిం నగర్ జనాలంటున్నారు.ఈ సినిమా ఇప్పటివరకూ మూడు పాటల చిత్రీకరణ, అలాగే 30 రోజుల పాటు టాకీ చిత్రీకరణ జరుపుకుందట. ఈ "మహాదేవనాయుడు" చిత్రాన్ని నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజైన జూన్‍ 10 వ తేదీన విడుదల చేయ్యాలని నిర్మాత యమ్.యల్.కుమార్ చౌదరి సన్నాహాలు చేస్తున్నారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.