English | Telugu

తీయని కలవో పాటలు విడుదల

అఖిల్ కార్తీక్, శ్రీతేజ, హుదుషా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం "తీయని కలవో". బలమూరి రామమోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శివాజీ యు. దర్శకత్వం వహిస్తున్నాడు. రవీంద్రప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్ర పాటలు ఇటీవలే హైదరాబాదులో విడుదలయ్యాయి. తొలి సిడీని హీరో సుధీర్ బాబు, నవీన్ చంద్ర ఆవిష్కరించి, దర్శకుడు శ్రీవాస్ కు అందజేసారు. అందరి మనసులను హత్తుకునే తియ్యని కల లాంటి ప్రేమకథ ఇది. రవీంద్ర మంచి పాటలు అందించాడు. వచ్చే నెలలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకోస్తామన్నారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని అందరు కోరారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర పోస్టర్స్ కు మంచి స్పందన వస్తుంది. పాటలు కూడా ప్రేక్షకాదరణ పొందుతుందనే నమ్మకం ఉందని దర్శకుడు శ్రీవాస్ అన్నారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.