English | Telugu

పవన్ తీన్ మార్ నైజాం ఎవరిదంటే

ప్రముఖ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న "తీన్ మార్" మూవీ యొక్క నైజాం ఏరియా పంపిణీ హక్కులు ఎవరికి దక్కాయంటే మల్టీ డైమెన్షన్ కంపెనీకి దక్కాయని వినికిడి. వివరాల్లోకి వెళితే పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై, ప్రముఖ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, అందాల తార త్రిష హీరోయిన్ గా, జయంత్.సి.పరాన్జీ దర్శకత్వంలో, గణేష్ నిర్మిస్తున్న చిత్రం "తీన్ మార్". ఈ "తీన్ మార్" చిత్రం యొక్క నైజాం ఏరియా హక్కులను మల్టీ డైమెన్షన్ కంపెనీ సొంతం చేసుకుందట. ఈ "తీన్ మార్" చిత్రాన్ని అలాంటి పెద్ద కంపెనీ అయితే నైజాం ఏరియాలో మంచి థియేటర్లలో విడుదల చేయగలదని సమాచారం.

ఒక సినిమాని ఎంత బాగా తీసినా ఆ సినిమాని సరైన థియేటర్లలో రిలీజ్ చేయలేకపోతే దాని ఫ్లేవర్ పాడైపోతుంది. చాలా సినిమాలకు గతంలో ఈ అనుభవం ఎదురయ్యింది. ఈ "తీన్ మార్" చిత్రానికి ఆ పరిస్థితి రాకూడదనే మల్టీ డైమెన్షన్ కంపెనీకి ఈ నైజాం ఏరియా పంపిణీ హక్కులను అందించారని తెలిసింది. ఈ "తీన్ మార్" చిత్రానికి మణిశర్మ అందించిన సంగీతం విశేష ప్రేక్షకాదరణతో ఘనవిజయం సాధించింది. ఈ "తీన్ మార్" చిత్రాన్ని ఏప్రెల్ 14 వ తేదీన విడుదల చేస్తారని వినిపిస్తున్నా, అది బహుశా సాధ్యపడకపోవచ్చు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.