English | Telugu

నెపోలియన్ గా సునీల్

"నెపోలియన్" గా సునీల్ నటించబోతున్నాడట. వివరాల్లోకి వెళితే హాస్యనటుడిగా ఉన్న సునీల్ ఉన్నట్టుండి "అందాల రాముడు" సినిమాతో హీరోగా మారాడు. అయినా కామెడీ వేషాలు మానలేదు. రాజమౌళి తీసిన "మర్యాదరామన్న" సినిమాతో పూర్తి స్థాయి హీరోగా మారిపోయాడు సునీల్. ఆ తర్వాత కామెడీ వేషాలు వేయటం దాదాపు మానేశాడనే చెప్పాలి. అనంతరం రామ్ గోపాలవర్మ దర్శకత్వంలో "కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అప్పల్రాజు", "దొంగల ముఠా" వంటి ఫ్లాప్ చిత్రాల్లో నటించాడు సునీల్.

దర్శకుడు యస్.యస్.రాజమౌళి సినిమాలో నటించిన హీరోకి ఆ తర్వాత ఒక పట్టాన సక్సస్ రాదనేది జగమెరిగిన సత్యం. ఉదాహరణకు సింహాద్రి తర్వాత యన్ టి ఆర్ కీ, విక్రమార్కుడు తర్వాత రవితేజకీ, ఛత్రపతి తర్వాత ప్రభాస్ కీ, అలాగే మర్యాదరామన్న తర్వాత సునీల్ కీ అలా రాజమౌళి ఎఫెక్ట్ పడింది. అయితే ప్రస్తుతం శాన్వి ప్రొడక్షన్స్ పతాకంపై, సునీల్ హీరోగా, ఒక కొత్త కుర్రాణ్ణి దర్శకుడిగా పరిచయం చేస్తూ, గణేష్ ఇందుకూరి నిర్మిస్తున్న చిత్రం "నెపోలియన్". "నెపోలియన్" చిత్రం మళయాళంలో సూపర్ హిట్టయిన ఒక సినిమాకి తెలుగు రీమేక్ గా నిర్మిస్తున్నారు. ఈ "నెపోలియన్" సినిమా కచ్చితంగా మంచి హిట్టవుతుందని సునీల్ ఎంతో నమ్మకంగా ఉన్నాడు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.