English | Telugu

ఇళయరాజా, మోహన్ బాబుల శాస్త్రీయ సంగీత విశ్వవిద్యాలయం

ఇళయరాజా, మోహన్ బాబుల శాస్త్రీయ సంగీత విశ్వవిద్యాలయం ప్రారంభం కాబోతూందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే ప్రముఖ నటుడు, నిర్మాత, విద్యాదాత అయిన కలెక్షన్ కింగ్, పద్మశ్రీ, డాక్టర్ మంచు మోహన్ బాబు త్వరలో ఒక శాస్త్రీయ సంగీత విశ్వవిద్యాలయాన్ని స్థాపించబోతున్నారు. ఆ విశ్వవిద్యాలయానికి అధిపతిగా ప్రముఖ సినీసంగీత దర్శకులు, ఇసైరాజాగా పేరుపడ్డ మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా వ్యవహరిస్తారు.

పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి పట్టణానికి సమీపంలో శ్రీ విద్యానికేతన్ అనే అన్ని ఆధునిక వసతులతో కూడిన చక్కని విద్యాలయాన్ని స్థాపించిన మోహన్ బాబు ఈ శాస్త్రీయ సంగీత విశ్వవిద్యాలయాన్ని కూడా అక్కడే స్థాపించాలని అనుకుంటున్నారు. ఈ శాస్త్రీయ సంగీత విశ్వవిద్యాలయానికి అధిపతిగా వ్యవహరించటానికి ఇళయరాజా కూడా అంగీకరించారనీ, ఇక ఆ శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆశీర్వాదం తీసుకుని శాస్త్రీయ సంగీత విశ్వవిద్యాలయం పనులు త్వరలో ప్రారంభించనున్నారని తెలిసింది. మోహన్ బాబుకి సంగీతం అంటే చాలా ఇష్టం అన్న సంగతి ఆయన సినిమాల్లోని పాటలే మనకు చెపుతాయి.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.