English | Telugu

కొలంబస్'కి అందుకే కనెక్ట్ అయ్యాను




వరుస విజయాలతో హీరోగా దూసుకెళుతున్నారు సుమంత్ అశ్విన్. మంచి కథలు, పాత్రలు ఎంపిక చేసుకుంటున్న ఈ యువహీరో ప్రస్తుతం నటించిన చిత్రం 'కొలంబస్'. డిస్కవరీ ఆఫ్ లవ్ అనేది ఉపశీర్షిక. ఏకేఎస్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై ఆర్. సామల దర్శకత్వంలో అశ్వనీ కుమార్ సహదేవ్ నిర్మించిన ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే పూర్తయ్యింది.

'కొలంబస్' విశేషాలను సుమంత్ అశ్విన్ చెబుతూ - ''లవర్స్, కేరింత.. ఇలా వరుస విజయాల తర్వాత నేను చేసిన చిత్రం ఇది. కథ విని, వెంటనే అంగీకరించాను. అంతగా ఈ కథ నన్ను ఎగ్జయిట్ మెంట్ కి గురి చేసింది. ఎంటర్ టైన్ మెంట్ తో పాటు ఎమోషన్స్ కు కూడా ప్రాధాన్యం ఉన్న కథ. అందుకే కనెక్ట్ అయిపోయాను. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా నచ్చుతుంది. నా పాత్ర చాలా భిన్నంగా ఉంటుంది. ఇందులో నా సరసన 'రన్ రాజా రన్' ఫేం సీరత్ కపూర్, 'చిన్నదాన నీ కోసం'లో చేసిన మిస్తీ చక్రవర్తి కథానాయికలుగా నటించారు.

'ఇష్క్' సినిమాకి రచయితగా పని చేసిన ఆర్. సామల ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయమవుతున్నారు. నిర్మాత సహదవ్ క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీపడలేదు. జితిన్ మంచి పాటలు ఇచ్చారు. ఇది రొమాంటిక్ మ్యూజికల్ ఎంటర్ టైనర్. సీన్స్ అన్నీ ఫ్రెష్ గా ఉంటాయి. షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అక్టోబర్ లో పాటలను, నవంబర్ మొదటి వారంలో సినిమాని విడదల చేయాలనుకుంటున్నాం'' అని చెప్పారు.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.