English | Telugu

సుజీత్ సినిమాటిక్ యూనివర్స్.. ఓజీలో పవన్ తో పాటు మరో ఇద్దరు స్టార్స్!

సౌత్ ఇండియాలో సినిమాటిక్ యూనివర్స్ ట్రెండ్ ఊపందుకుంటోంది. కోలీవుడ్ లో లోకేష్ కనగరాజ్ ఈ ట్రెండ్ కి శ్రీకారం చుట్టాడు. టాలీవుడ్ లోనూ 'హనుమాన్'తో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ స్టార్ట్ అయింది. అలాగే, మాలీవుడ్ లో ఇటీవల లోకా సినిమాటిక్ యూనివర్స్ కి అడుగు పడింది. ఇప్పుడిదే బాటలో టాలీవుడ్ లో మరో యూనివర్స్ మొదలు కానుందని తెలుస్తోంది. దీని క్రియేటర్ ఎవరో కాదు.. 'ఓజీ' డైరెక్టర్ సుజీత్. (They Call Him OG)

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపొందిన మూవీ 'ఓజీ'. డీవీవీ ఎంటర్టైన్మెంట్ నిర్మించిన ఈ గ్యాంగ్ స్టర్ ఫిల్మ్ పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఈ మూవీ మరి కొద్ది గంటల్లో థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఈరోజు రాత్రి నుంచే ప్రీమియర్స్ పడనున్నాయి. ఇలాంటి సమయంలో 'ఓజీ'కి సంబంధించిన ఓ వార్త.. సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.

Also Read:ఓజీ రికార్డు బిజినెస్.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ తెలిస్తే షాక్!

'ఓజీ'తో సుజీత్.. ఓ సినిమాటిక్ యూనివర్స్ ని స్టార్ట్ చేస్తున్నాడట. ప్రభాస్ తో చేసిన ఆయన గత చిత్రం 'సాహో'కి, ఓజీ కథతో లింక్ ఉంటుందని వినికిడి. అంతేకాదు, సుజీత్ నెక్స్ట్ నానితో చేయబోయే సినిమాతోనూ.. 'ఓజీ'కి లింక్ ఉంటుందట. సాహో ప్రపంచంతో పాటు, సాహోలోని కొన్ని కీలక పాత్రలు 'ఓజీ'లో కనిపిస్తాయని అంటున్నారు. ముఖ్యంగా ప్రభాస్ కాసేపు కనిపించి సర్ ప్రైజ్ చేసే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. ఇక ఓజీ సినిమా చివరిలో నానిని పాత్రని పరిచయం చేసి, నెక్స్ట్ మూవీకి లీడ్ కూడా ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే ఎక్కడ చూసినా 'ఓజీ' మేనియా కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో పాటు, సినీ ప్రియులంతా "ఓజీ ఓజీ" అంటూ ఊగిపోతున్నారు. అలాంటిది, ఈ సినిమాలో ప్రభాస్, నాని కూడా కనిపిస్తే.. సినీ అభిమానులకు అంతకంటే బిగ్ ట్రీట్ ఉండదని చెప్పవచ్చు.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.