English | Telugu

చేతులు జోడించి అడుగుతున్నా.. శ్రీలీల ఎమోషనల్!

ఏఐ అనేది హీరోయిన్స్ పాలిట విలన్ గా మారుతోంది. ఏఐని కొందరు మంచిగా ఉపయోగిస్తూ అద్భుతాలు సృష్టిస్తుంటే.. మరికొందరు చెడుగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా హీరోయిన్ల ఫేస్ తో అసభ్యమైన ఫేక్ ఫోటోలు, వీడియోలు జనరేట్ చేస్తున్నారు. ఇవి నిజమైనవని నమ్మేవారు కూడా ఉన్నారు. దీంతో హీరోయిన్స్ బాగా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే పలువురు హీరోయిన్లు ఈ ఫేక్ బారిన పడగా.. తాజాగా శ్రీలీల వంతు వచ్చింది. (Sreeleela)

ఎవరో ఆకతాయిలు ఏఐ ద్వారా శ్రీలీల ఫేక్ ఫోటోలు జనరేట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయం శ్రీలీల దృష్టికి వెళ్ళడంతో ఆమె స్పందించింది. ఇటువంటి వాటిని ప్రోత్సహించవద్దని కోరుతూ సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేసింది.

Also Read: కామెడీ లేని రాజా సాబ్.. షాకిచ్చిన మారుతీ!

"ఏఐ ద్వారా జనరేట్ చేసే నాన్ సెన్స్ కి సపోర్ట్ చేయవద్దని ప్రతి సోషల్ మీడియా యూజర్ ని చేతులు జోడించి అడుగుతున్నాను. టెక్నాలజీని మంచికి ఉపయోగించాలి, చెడుకి కాదు. నా తోటి నటీమణులు కూడా ఇలాంటి సమస్యనే ఎదుర్కొంటున్నారు. ఈ విషయంలో ప్రేక్షకులు మాకు అండగా నిలవాలని కోరుతున్నాను." అంటూ శ్రీలీల ట్వీట్ చేసింది.

శ్రీలీల ట్వీట్ కి నెటిజెన్ల నుంచి మద్దతు లభిస్తోంది. ఏఐ వల్ల మహిళలు బాగా ఇబ్బంది పడుతున్నారని, ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కామెంట్స్ చేస్తున్నారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.