English | Telugu

తండ్రికి దూరమైన శృతిహాసన్

కమల్ హాసన్ ప్రస్తుతం "ఉత్తమ విలన్" చిత్రంలో నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఇందులో తండ్రి కూతుళ్ళ మధ్య కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. అందుకోసం కమల్ తన కూతురు పాత్రను వేరే ఎవరితో చేయించడం ఎందుకని శృతిని సంప్రదించారు. కానీ శృతి వరుస సినిమాలతో బిజీగా ఉంది. పైగా తన డేట్స్ ఇదివరకే వేరే చిత్రానికి కేటాయించడంతో 'ఉత్తమ విలన్' సినిమా కోసం తన డేట్స్ ను సర్దుబాటు చేయకపోయింది. దాంతో కమల్ కూతురిగా నటించే అవకాశం పార్వతీ మీనన్ కు దక్కింది. అయితే ఈ విషయంపై శృతి చాలా బాధపడుతుంది."నాన్నకు కూతురిగా నటించే అదృష్టం చేయిదాకా వచ్చి జారిపోయింది. చాలా బాధగా ఉంది. కానీ నా ఇబ్బంది నాన్నకు కూడా తెలుసు. అందుకే ఆ విషయాన్నీ తేలిగ్గా తీసుకున్నారు. కానీ నాకు మాత్రం చాలా బాధగా ఉంది. భవిష్యత్తులో తప్పకుండా ఆయనతో నటిస్తాను" అని ఆత్మవిశ్వాసంతో చెప్తుంది శృతి.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.