English | Telugu

ఈసారి స్వామి స్వామి రా రా

నిఖిల్, స్వాతి జంటగా నటించిన చిత్రం "స్వామి రా రా". చిన్న చిత్రమైన కూడా మంచి విజయాన్ని సాధించింది. దర్శకుడిగా సుధీర్ వర్మ తన తొలిప్రయత్నంలోనే ఒక చక్కని కథతో విజయాన్ని సొంతం చేసుకున్నారు. అయితే ఈ చిత్రానికి కొనసాగింపుగా మరో చిత్రం వస్తోంది. "స్వామి స్వామి రా రా" 'ది సాగా కంటిన్యూస్' అనేది ఉపశీర్షిక. చక్రి చిగురుపాటి నిర్మించనున్న ఈ చిత్రానికి ఎస్.బోస్ దర్శకత్వం వహిస్తారు. ఈ చిత్ర వివరాల గురించి సహ నిర్మాత బి.ఎస్.వర్మ మాట్లాడుతూ... 'మంచి సినిమాలకు ఎప్పడూ ఆదరణ ఉంటుందని నిరూపించిన చిత్రం 'స్వామి రా రా'. ఇపుడు ఈ చిత్రానికి సీక్వెల్ సిద్ధం చేస్తున్నాం. ఇందులో ఓ ప్రముఖ కథానాయకుడు హీరోగా నటించనున్నారు. ఆయనేవరనేది త్వరలోనే చెబుతాము' అని అన్నారు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.