English | Telugu

ఏంటి కవిత గారు దణ్ణం పెట్టడం కూడా చేత కాదా!

సీనియర్ నటి కవిత.. తెలుగు సినిమా చరిత్రలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కె విశ్వనాథ్ డైరెక్షన్ లో సిరి సిరి మువ్వతో తెలుగులో నటిగా అరంగేట్రం చేసిన కవిత.. ఇండస్ట్రీకి వచ్చి ఇరవై సంవత్సరాలైంది. అయితే కవిత తన వ్యక్తిగత జీవితం గురించి పొలిటికల్ లైఫ్ గురించి తెలుగువన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది.

మీకు ఎన్టీఆర్ ఎలా తెలుసని ప్రశ్నించగా.. "మేం చెన్నైలో టీనగర్ లో ఒక పార్క్ దగ్గర ఉండేవాళ్ళం. ఆ పార్క్ కి అటువైపు మేము.. ఇటువైపు ఎన్టీగారు ఉండేవారు. నేను మా అమ్మ కలిసి పొద్దున్నే నాలుగు గంటలకు ఎన్టీఆర్ గారిని దర్శించుకోడానికి వెళ్ళేవాళ్ళం. ఆయనని చూడగానే కాళ్ళకి దండం పెట్టేవాళ్ళం. ఆయనని చూడటానికి ఎక్కడెక్కడి నుండో జనాలు బస్సుల్లో వచ్చేచారు.

తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నవాళ్ళు.. తర్వాత ఎన్టీఆర్ గారిని దర్శించుకునేవాళ్ళు. మా అమ్మ , ఎన్టీఆర్ గారు మంచి స్నేహితులు.. అలా మా అమ్మ నన్ను ఆయనకు పరిచయం చేసింది. ఆ తర్వాత లాయర్ విశ్వనాథ్ సినిమాలో ఆయనకి చెల్లెలి పాత్రలో నటించాను" అని కవిత చెప్పింది.తను సీనియర్ ఎన్టీఆర్ తో కలిసి పొలిటికల్ ర్యాలీలో పాల్గొందంట. అయితే అలా ర్యాలీలో వెళ్తున్నప్పుడు ఆయన ఒక కుగ్రామంలో ఒక చెట్టుకింద దుప్పటి వేసుకుని పడుకున్నాడు. ఎప్పుడు ఆయన సామాన్యుడినే అని చెప్పేవారు అని తెలిపింది.

ఎన్టీఆర్ గారితో ఎన్ని సినిమాలలో నటించారని ప్రశ్నించగా.. "చాలా సినిమాలలో చేసాను.‌ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర సినిమా షూటింగ్ కోసం కడప వెళ్ళాం. అక్కడ నేను ఒక చెట్టు వెనకాల ఉన్నాను. అక్కడ ఆశ్రమంలో ఎన్టీఆర్ గారు ఉన్నారు.. అక్కడ నుండి మెగాఫోన్ లో మాట్లాడుతున్నారు నాకర్థం కాలేదు.. దాంతో కాసేపటికి హరికృష్ణ గారు నా దగ్గరికి వచ్చి తప్పుగా దణ్ణం పెట్డమని చెప్పారు. దాంతో నేను అలాగే చేసాను. దానికి ఎన్టీఆర్ గారు పిలిచి.. ఏంటి కవిత గారు దణ్ణం పెట్టడం కూడా చేత కాదా అని అందరిముందు అనేసరికి నేను ఏడ్చేసాను.

ఆ తర్వాత బాపయ్య గారి డైరెక్షన్ లో అగ్గి రవ్వ చేసాను. అందులో నేను హీరోయిన్ ని... ఎన్టీఆర్‌ గారు హీరోగా డ్యుయల్ రోల్ చేసారు.. ఆ తర్వాత చండశాసనుడు సినిమాలో గెస్ట్ రోల్ గా చేసాను" అని చెప్పుకొచ్చింది కవిత. ఇలా తన కెరీర్ మరియు వ్యక్తిగత జీవితం గురించి ఆమె తెలుగు వన్ తో షేర్ చేసుకుంది.


జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.