English | Telugu

నితిన్, సమంతల అ..ఆ మొదలైంది

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్, సమంతల సినిమా ప్రారంభోత్సవం గురువారం ఉదయం రామానాయుడు స్టూడియోలో జరిగింది. మొదటి నుంచీ త్రివిక్రమ్ సినిమా పేర్లు మాంచి క్యాచీగా వుంటాయి. రెండు, మూడు, నాలుగు అక్షరాలే. ఈసారి కూడా అలా రెండు అక్షరాల పేరే పెట్టారు..అ..ఆ అంటూ కానీ ఇది షార్ట్ కట్టే,.పూర్తి పేరు...'అనసూయ రామలింగం' వర్సెస్ 'ఆనంద్ విహారి అన్నమాట. దీన్ని ఉపశీర్షికగా పెట్టారు. అక్టోబర్ 10 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి, 2016 సంక్రాంతి కానుకగా చిత్రాన్ని విడుదల చేయనున్నామని నిర్మాత తెలిపారు.

నితిన్-సమంతలతో త్రివిక్రమ్-రాధాకృష్ణ తమ హారిక హాసిని బ్యానర్ పై నిర్మిస్తారు. సమంతకు తోడుగా మరో హీరోయిన్ ను కూడా ఎంపిక చేసారు. ప్రేమమ్ సినిమాలో నటించిన అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో రెండవ హీరోయిన్ గా నటిస్తుంది. వాస్తవానికి ఈమెను, ఇదే బ్యానర్ లో నాగచైతన్యతో నిర్మించే ప్రేమమ్ రీమేక్ కు కూడా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

నితిన్-త్రివిక్రమ్ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తారు. నటరాజ్ సుబ్రహ్మణ్యం సినిమాటోగ్రఫీని, రాజీవన్ ఆర్ట్ డైరక్షన్ ను అందిస్తారు. పూర్తిగా ఫ్రెష్ లుక్ తో, డిఫరెంట్ టేకింగ్ తో సినిమా చేయాలని చూస్తున్నారు త్రివిక్రమ్. అందుకే తన టెక్నీషియన్స్ బ్యాచ్ ను కూడా మార్చేసారు. మేకింగ్ అంతా వైవిధ్యంగానే వుంటుంది అని వినికిడి.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.