English | Telugu

'సలార్' టీజర్ అప్డేట్ వచ్చేసింది.. ఇదేం టైమింగ్ బ్రో!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతోన్న బిగ్గెస్ట్ యాక్షన్ ఫిల్మ్ 'సలార్'. 'బాహుబలి' తర్వాత ఆ స్థాయిలో కలెక్షన్ల సునామీ సృష్టించగల సినిమా ఇది అని ప్రభాస్ ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు సినిమాపై అంచనాలను పెంచేశాయి. తాజాగా ఈ మూవీ టీజర్ అప్డేట్ వచ్చింది.

'సలార్' టీజర్ ని జూన్ 6 ఉదయం5:12 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలుపుతూ తాజాగా చిత్ర బృందం ఒక పోస్టర్ ను వదిలింది. ఒక భారీ యాక్షన్ సన్నివేశంలోని స్టిల్ ని పోస్టర్ లో చూడొచ్చు. చేతిలో సుత్తి పట్టుకొని ఫైట్ చేస్తున్న ప్రభాస్ కటౌట్ చూస్తుంటే.. 'కేజీఎఫ్'ని మించిన ఎలివేషన్స్, వయోలెన్స్ ప్రశాంత్ నీల్ చూపించబోతున్నారని అర్థమవుతోంది.

మామూలుగా సినిమా అప్డేట్ ని అందరూ మేల్కొని ఉండి, యాక్టివ్ గా ఉన్న సమయంలో ఇవ్వాలనుకుంటారు. ఇప్పుడు వ్యూస్, లైక్స్ రికార్డులు కూడా ఫ్యాన్స్ పట్టించుకుంటున్నారు కాబట్టి.. స్టార్ హీరోల సినిమాల టీజర్లు, ట్రైలర్లు సరైన సమయానికి విడుదల చేయడమనేది చాలా ముఖ్యం. అలాంటిది అందరూ సరిగా నిద్ర కూడా లేవని సమయంలో తెల్లవారుజామున 5 గంటల సమయంలో టీజర్ రిలీజ్ చేయాలని సలార్ టీమ్ తీసుకున్న నిర్ణయం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఒక వైపు ఫ్యాన్స్ లో టీజర్ వస్తుందన్న ఆనందమున్నా, మరోవైపు వారు రిలీజ్ టైం పట్ల కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నారు.

'సలార్' పై ప్రభాస్ ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. 'బాహుబలి' తర్వాత ప్రభాస్ నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర నిరాశపరుస్తున్నాయి. 'సాహో' సినిమా నార్త్ లో మంచి కలెక్షన్స్ రాబట్టినప్పటికీ, ఓవరాల్ గా మాత్రం బాక్సాఫీస్ ఫెయిల్యూర్ గానే మిగిలింది. 'రాధేశ్యామ్' అయితే పూర్తి నెగటివ్ టాక్ తో డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఇటీవల విడుదలైన 'ఆదిపురుష్' రికార్డు స్థాయి ఓపెనింగ్స్ రాబట్టినప్పటికీ బాక్సాఫీస్ ఫెయిల్యూర్ గా మిగలడం ఖాయమైంది. ఇలా వరుసగా మూడు పరాజయాలు పలకరించడంతో.. 'కేజీఎఫ్'తో పాన్ ఇండియా రేంజ్ లో సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'సలార్'పైనే ప్రభాస్ ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు.

హోంబలే ఫిలిమ్స్ నిర్మిస్తున్న 'సలార్' సినిమాని 2023, సెప్టెంబర్ 28 న భారీస్థాయిలో విడుదల కానుంది. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.