English | Telugu

ఎన్నాళ్లకెన్నాళ్లకు అనుష్క సినిమా వస్తుంది!

అనుష్క శెట్టి, నవీన్ పొలిశెట్టి జంటగా పి.మహేష్ బాబు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'. అన్విత ర‌వళి శెట్టి పాత్ర‌లో అనుష్క‌, స్టాండ‌ప్ క‌మెడియ‌న్‌ సిద్ధు పొలిశెట్టి పాత్ర‌లో న‌వీన్ పొలిశెట్టి నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రధన్ సంగీత దర్శకుడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్ కి, టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం చూడాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ని ప్రకటించారు మేకర్స్.

'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' చిత్రాన్ని ఆగ‌స్ట్ 4న తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుదల చేస్తున్నట్లు తెలుపుతూ తాజాగా మేకర్స్ ఓ పోస్టర్ ను వదిలారు. హీరోహీరోయిన్లతో రూపొందించిన ఈ పోస్టర్ కలర్ ఫుల్ గా క్యూట్ గా ఉంది.

యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో 'భాగమతి' త‌ర్వాత అనుష్క న‌టిస్తోన్న చిత్రమిది. తెలుగులో అనుష్కకు స్టార్ ఇమేజ్ ఉంది. అయితే ఆమె 'బాహుబలి-2' తర్వాత సినిమాలు బాగా తగ్గించారు. ఆమె చివరిగా ప్రధాన పాత్ర పోషించి థియేటర్ లో సందడి చేసిన చిత్రం 'భాగమతి'(2018). ఆమె నటించిన 'నిశ్శబ్దం'(2020) నేరుగా ఓటీటీలో విడుదలైంది. అందుకే విరామం తర్వాత అనుష్క నుంచి వస్తున్న సినిమా కావడంతో 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'పై అభిమానుల్లోనూ, ప్రేక్షకుల్లోనూ ఆసక్తి నెలకొంది.

మరోవైపు ఈ సినిమాకి న‌వీన్ పొలిశెట్టి రూపంలో మరో ఆకర్షణ ఉంది. 'ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ', 'జాతిరత్నాలు' ఘన విజయాలు సాధించడంతో.. కేవలం రెండు సినిమాలకే తెలుగునాట మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నవీన్. 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'తో హ్యాట్రిక్ అందుకుంటారనే అంచనాలు ఉన్నాయి. మరి ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రం అనుష్కకి, నవీన్ కి ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.