English | Telugu

ఆంధ్రా వారితో దిల్ రాజు వియ్యం... జైపూర్‌‌లో పెళ్లి!

ఇప్పుడు సినీ ఇండ‌స్ట్రీలో పెళ్లి భాజాల‌కు స‌మ‌యం వ‌చ్చిన‌ట్లుంది. మెగా ఫ్యామిలీలో వ‌రుణ్ తేజ్‌, లావ‌ణ్య త్రిపాఠిలు ఇట‌లీలో పెళ్లి చేసుకోనున్నారు. మ‌రో వైపు హీరో వెంక‌టేష్ రెండో కుమార్తె వివాహం కూడా జ‌ర‌గ‌నుంది. రీసెంట్‌గానే నిశ్చితార్థం కూడా జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. అలాగే ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం.కీర‌వాణి రెండో త‌న‌యుడు, హీరో శ్రీసింహ, ముర‌ళీ మోహ‌న్ మ‌న‌వరాలితో పెళ్లి పీట‌లెక్క‌నున్నారు. ఈ క్ర‌మంలో తెలుగు చిత్రీసీమ‌కు చెందిన మ‌రో ప్ర‌ముఖ వ్య‌క్తి ఇంట్లో పెళ్లి భాజాలు మోగ‌నున్నాయి. ఆ వ్య‌క్తి ఎవ‌రో కాదు.. దిల్ రాజు. ఈ అగ్ర నిర్మాత సోద‌రుడు, శిరీష్ త‌న‌యుడు ఆశిష్ రెడ్డి త్వ‌ర‌లోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు.

తెలంగాణ ప్రాంతానికి చెందిన దిల్‌రాజు ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఓ ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త‌తో వియ్య‌మందుతున్నట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. డిసెంబ‌ర్ నెల‌లో నిశ్చితార్థం జ‌ర‌గ‌నుంది. ఫిబ్ర‌వ‌రిలో పెళ్లి జ‌ర‌నుంది. మ్యారేజ్‌ను జైపూర్‌లో ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని అనుంటున్నారు. నిజానికి ఆశిష్ పెళ్లి గురించి ఆగ‌స్ట్ నుంచి వార్త‌లు వినిపించాయి. రెండు కుటుంబాల‌కు చెందిన పెద్ద‌లు క‌లిసి మాట్లాడుకున్నారు. దిల్ రాజు త‌ర‌పున సుకుమార్ సైతం ఆశిష్ పెళ్లి పెద్ద‌గా మాటా మంతీ కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్న‌ట్లు న్యూస్ వినిపించింది.

సినీ నిర్మాణ వ్య‌వ‌హారాల్లో చురుకుగా వ్య‌వ‌హ‌రిస్తూ వ‌చ్చిన ఆశిష్ రెడ్డి గ‌త ఏడాది విడుద‌లైన రౌడీ బాయ్స్ చిత్రంతో హీరోగా మారారు. దానికి శ్రీహ‌ర్ష ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్‌గా న‌టించింది. ఇప్పుడు సుకుమార్ శిష్యుడు విశాల్ కాశీ ద‌ర్శ‌క‌త్వంలో సెల్ఫిష్ అనే సినిమా చేస్తున్నారు. త‌మ హోం బ్యాన‌ర్ అయిన శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌తో పాటు సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్ కూడా ఈ మూవీ నిర్మాణంలో భాగ‌స్వామిగా వ్య‌వ‌హ‌రిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ సినిమా నిర్మాణ ద‌శ‌లో ఉంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.