English | Telugu

ఆ కేసు నుంచి షారుఖ్ ఖాన్‌కు ఊరట


బాలీవుడ్ టాప్ హీరో షారుఖ్ ఖాన్ సెరగేటరీ ద్వారా మూడవ సంతానాన్ని పొందిన క్రమంలో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వాహించారని ఆరోపణలు వచ్చాయి. సామాజిక కార్యకర్త వర్షాదేశ్ పాండే షారుఖ్ ఖాన్ దంపుతులపై కేసు ఫైలు చేశారు. ఈ కేసులో వీరికి ఊరట లభించినట్లు తెలుస్తోంది. గురువారం ముంబాయి హైకోర్టు ఈ కేసును తోసిపుచ్చింది. కింద కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సమర్థించింది. వారి మూడో సంతానం విషయంలో లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు ఈ దంపతులు ప్రయత్నించారని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ కేసు నమోదు అయ్యింది. హైకోర్టు ఉత్తర్వులతో కేసు నుంచి బయటపడిన షారుఖ్, గౌరీలు సంతోషం వ్యక్తం చేశారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.