English | Telugu

దాసరికి రామ్ చరణ్ కౌంటర్

దాసరికి రామ్ చరణ్ కౌంటర్ ఇచ్చాడని సినీ వర్గాలంటున్నాయి. వివరాల్లోకి వెళితే ఇటీవల దర్శకరత్న, డాక్టర్ దాసరి నారాయణరావుకి మన ముఖ్యమంత్రి యన్.కిరణ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా యస్.వి.రంగారావు స్మారక అవార్డు లభించింది. ఆ సందర్భంగా మాట్లాడుతూ " నేడు హీరోల డామినేషన్ ఎక్కువయ్యింది. ఒక్క కుప్పిగంతుల డ్యాన్స్ వస్తే చాలు. నటన రాకపోయినా ఫరవా లేదు. డైలాగ్ చెప్పటం రాకపోయినా బాధలేదు హీరోలుగా చెలామణీ అయిపోతున్నారు... ఇండస్ట్రీని భ్రష్టు పట్టిస్తున్నారు. ఈ పరిస్థితి మారాలి.." అంటూ దాసరి ప్రసంగించారు.

ఈ మాటలు ఆయన ఎవర్ని ఉద్దేశించి అన్నారో అందరికీ ఇట్టే అర్థమయ్యే విషయమే. దానికి కౌంటర్ గా యువ హీరో రామ్ చరణ్ మాట్లాడుతూ " ఈ సో కాల్డ్ గ్రేట్ డైరెక్టర్లంతా స్టేజీలెక్కి ఊక దంపుడు ఉపన్యాసాలివ్వటానికి తప్ప ఇంకెందుకూ పనికిరారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక హిట్ సినిమా తీయమనండి. వాళ్ళ వల్లకాదు. ఇలా నోటికి వచ్చినట్లు విమర్శించటం తప్ప వాళ్ళేమీ చేయలేరు" అని అన్నారు.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.