English | Telugu

రామ్ చరణ్ "ఎవడు" ప్రారంభం

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో, దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం "ఎవడు". హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో, డిసెంబర్ 9 వ తేదీన ఉదయం 7 గంటలకు, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కెమెరా స్విచ్చాన్ చేయగా, మెగాస్టార్ చిరంజీవి క్లాప్ కొట్టగా, మరో ప్రముఖ నిర్మాత శ్యాం ప్రసాద రెడ్డి ముహూర్తం షాట్ కు గౌరవ దర్శకత్వం వహించగా "ఎవడు" చిత్రం ఘనంగా ప్రారంభమైంది. ఈ "ఎవడు" చిత్రానికి వక్కంతం వంశీ కథనందించగా, సంగీతం దేవీశ్రీ ప్రసాద్ అందిస్తున్నారు. శ్యాం.కె.నాయుడు సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు.

ఈ "ఎవడు" చిత్రంలో ప్రముఖ హీరో అల్లు అర్జున్ 20 నిమిషాల సేపు కనిపించనున్నారు. అంటే అతిథి పాత్రలో అల్లు అర్జున్ ఈ "ఎవడు" చిత్రంలో నటించబోతున్నారన్నమాట. ఈ "ఎవడు" చిత్రం ప్రారంభోత్సవానికి మెగాస్టార్ చిరంజీవి అయ్యప్ప మాలతో, బ్లాక్ కలర్ లాల్చీ, బ్లాక్ కలర్ లుంగీతో రావటం విశేషం. ఈ ప్రారంభోత్సవానికి ప్రముఖ నిర్మాతలు బూరుగుపల్లి శివరామ కృష్ణ, బి.వి.యస్.యన్.ప్రసాద్, మాగంటి బాబు, జెమినీ కిరణ్ వంటి వారు హాజరయ్యారు.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.