English | Telugu

ట్రాప్‌లో ప‌డొద్దు.. వ‌రుణ్ తేజ్‌కి రామ్ చ‌ర‌ణ్ స‌ల‌హా

మెగా హీరోల్లో ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్ పాన్ ఇండియా హీరో ఇమేజ్‌ను సంపాదించుకున్నారు. భారీ బ‌డ్జెట్ సినిమాల‌నే చేస్తూ వస్తున్నారు. సినిమాల‌నే కాదు.. ఫ్యామిలీ విష‌యాల్లో చ‌ర‌ణ్ త‌న వారికి మంచి స‌ల‌హాల‌నే ఇస్తున్నారు. ఈ విష‌యం చెప్పింది ఎవ‌రో కాదు.. హీరో వ‌రుణ్ తేజ్‌. త‌న‌కు అన్న‌య్య రామ్ చ‌ర‌ణ్ కెరీర్ ప‌రంగా ఓ స‌ల‌హాను ఇచ్చార‌ని, ఇప్పుడు ఆ స‌ల‌హానే తాను పాటిస్తున్నాన‌ని అంటున్నారు వ‌రుణ్ తేజ్‌. ఇంత‌కీ త‌మ్ముడుకి మెగా ప‌వ‌ర్ స్టార్ ఇచ్చిన స‌ల‌హా ఏంట‌నే వివ‌రాల్లోకి వెళితే..

రామ్ చ‌ర‌ణ్‌తో ఉన్న అనుబంధం గురించి వ‌రుణ్ తేజ్ ఓ సంద‌ర్భంలో మాట్లాడుతూ ‘‘నా ఏడ‌వ సినిమా త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ అన్న‌య్య‌ను క‌లిశాను. అప్పుడాయ‌న యూనిక్ స్క్రిప్ట్స్‌ను సెల‌క్ట్ చేసుకో అన్నారు. నీ చుట్టూ ఉండేవాళ్లు మార్కెట్ పోతుంద‌ని చాలా స‌ల‌హాలు ఇస్తారు. దాని వ‌ల్ల ప్ర‌యోగాలు చేయ‌టానికి ఆలోచ‌న‌లో ప‌డతావు. కాబ‌ట్టి అలాంటి ట్రాప్‌లో ప‌డొద్దు’’ అన్నారు.

వ‌రుణ్ తేజ్ ఇప్పుడు యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ గాండీవ‌ధారి అర్జున చిత్రంతో సంద‌డి చేయ‌బోతున్నారు. ఈ సినిమా ఆగ‌స్ట్ 25న రిలీజ్ కానుంది. ఇందులో గ్లోబ‌ల్ వార్మింగ్‌కు సంబంధించిన మెసేజ్‌ను కూడా ఇస్తున్నారు. ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాను బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ నిర్మించారు. సాక్షి వైద్య హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ ఏడాదిలోనే హీరోయిన్ లావ‌ణ్య త్రిపాఠిని వ‌రుణ్ తేజ్ పెళ్లి చేసుకోబోతున్నారు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.