English | Telugu

రానాని అందుకు కాదు తీసుకుంది - వర్మ

"రానాని అందుకు కాదు తీసుకుంది" అని వర్మ అన్నారట. వివరాల్లోకి వెళితే ప్రముఖ దర్శక, నిర్మాత రామ్ గోపాల వర్మ తాను త్వరలో నిర్మించబోతున్న హిందీ సినిమా "డిపార్ట్ మెంట్" లో రానాని హీరోగా తీసుకోవటానికి గల కారణాలను ముంబయ్ మీడియా తమాషాగా వివరించింది. అభిషేక్ బచ్చన్, రానా, బిపాసా బసు నటించగా ఇటీవల విడుదలైన "దమ్ మారో దమ్" చిత్రం విడుదలకు ముందే ఆ చిత్రం క్లైమాక్స్ ను రామ్ గోపాల వర్మ అందరికీ యస్.యమ్.యస్.ల ద్వారా తెలిసేలా చేశాడట. అందుకు అలిగిన అభిషేక్ చ్చన్ "డిపార్ట్ మెంట్" సినిమాలో నటించనన్నాడనీ, అందుకనే గతిలేని పరిస్థితుల్లోనే రామ్ గోపాల వర్మ రానాని హీరోగా తీసుకున్నాడనీ ముంబయ్ మీడియా అంటోంది.

కానీ అది నిజం కాదనీ తాను ఎవరికీ "దమ్ మారో దమ్" చిత్రం క్లైమాక్స్ ని ఆ చిత్రం విడుదలకు ముందే ఎవరికీ యస్.యమ్.యస్.ల ద్వారా పంపలేదనీ అన్నాడు వర్మ. రానాని "డిపార్ట్ మెంట్" మూవీలో హీరోగా తీసుకోటానికి కారణం, అభిషేక్ బచ్చన్ డేట్లు సర్దుబాటు కాకపోవటం వల్లనే అని మీడియాకు తెలిపాడు వర్మ. అంతేకాక తనకు అమితాబ్ బచ్చన్ కుటుంబం అంటే చాలా గౌరవం అనీ, అభిషేక్ బచ్చన్ అంటే అభిమానమనీ కూడా వర్మ అన్నాడు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.