English | Telugu

పవన్ కళ్యాణ్ ని కాదని రామ్ చరణ్ తో 'గేమ్ ఛేంజర్'!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ 'గేమ్ ఛేంజర్'. ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంతో చరణ్ మరోసారి 'ఆర్ఆర్ఆర్' స్థాయిలో పాన్ ఇండియా సక్సెస్ అందుకోవడం ఖాయమని ఆయన అభిమానులు నమ్ముతున్నారు. ఇదిలా ఉంటే అసలు ఈ సినిమాని శంకర్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేయాలనుకున్నారట. ఈ విషయాన్ని స్వయంగా దిల్ రాజు రివీల్ చేయడం విశేషం.

'దిల్' సినిమాతో నిర్మాతగా మారి ఆ సినిమా పేరునే ఇంటిపేరుగా మార్చుకున్న దిల్ రాజు.. నిర్మాతగా 20 వసంతాలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో తన సినిమాల విశేషాలను పంచుకున్న ఆయన.. 'గేమ్ ఛేంజర్' కి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని రివీల్ చేశారు. "శంకర్ గారు ఈ కథ చెప్పగానే నాకు నచ్చడంతో.. ఏ హీరోతో చేయాలి అనుకుంటున్నారని అడిగాను. ఆయన పవన్ కళ్యాణ్ లాంటి వారితో చేయాలనుకుంటున్నాను అన్నారు. లేదు సార్ ఈ కథ చరణ్ కి బాగుంటుందని నేను చెప్పాను. అప్పుడు చరణ్ ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో ఉన్నారు. నేను వెళ్లి చరణ్ ని కలిసి.. శంకర్ గారు ఒక కథ చెప్పారు, చాలా బాగుంది, ఒకసారి వినమని చెప్పాను. కథ విని చరణ్ కూడా వెంటనే ఓకే అన్నారు. అలా ఈ ప్రాజెక్ట్ లాక్ అయింది" అని దిల్ రాజు చెప్పుకొచ్చారు. అలా బాబాయ్ దగ్గరకి వెళ్లాల్సిన కథ అబ్బాయి దగ్గరకు వెళ్ళింది.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.