English | Telugu

ఇది రామ్ చరణ్ రేంజ్.. కళ్లుచెదిరే ధరకు 'పెద్ది' ఓటీటీ డీల్..!

ఓటీటీ బిజినెస్ బాగా పడిపోయింది అనేది కొంతకాలంగా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. విడుదలకు దగ్గరవుతున్న సినిమాల ఓటీటీ డీల్స్ కూడా క్లోజ్ అవ్వట్లేదని, కొందరు స్టార్స్ కి సైతం ఈ పరిస్థితి తప్పట్లేదని అంటున్నారు. అలాంటిది వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానున్న 'పెద్ది' (Peddi) మూవీ ఓటీటీ డీల్ అప్పుడే క్లోజ్ అయిందనే వార్త ఆసక్తికరంగా మారింది.

రామ్ చరణ్ (Ram Charan) హీరోగా 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'పెద్ది'. వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా 2026 మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. పెద్ది చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా గ్లింప్స్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. అందులోని క్రికెట్ షాట్ నేషనల్ వైడ్ గా ట్రెండ్ అయింది. గ్లింప్స్ కి అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో పెద్ది బిజినెస్ కి భారీ డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా డిజిటల్ రైట్స్ కోసం ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫామ్​ నెట్‌ఫ్లిక్స్ ఏకంగా రూ.110 కోట్లకు డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. విడుదలకు 9 నెలలకు పైగా సమయముండగానే.. ఇంతటి భారీ ధరకు ఓటీటీ డీల్ క్లోజ్ అవ్వడమనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి.

'ఆర్ఆర్ఆర్'తో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు. ఆ తర్వాత చరణ్ నుంచి వచ్చిన 'ఆచార్య', 'గేమ్ ఛేంజర్' సినిమాలు మెప్పించలేకపోయాయి. దాంతో 'పెద్ది'పైనే ఆశలు పెట్టుకున్నాడు. చరణ్ కెరీర్ లో 'రంగస్థలం' తరహాలో 'పెద్ది' కూడా ప్రత్యేకంగా నిలుస్తుందని ఫ్యాన్స్ కూడా బలంగా నమ్ముతున్నారు. గ్లింప్స్ సైతం ఆ నమ్మకాన్ని కలిగించింది. ఇక ఇప్పుడు భారీ ఓటీటీ డీల్ ఆ నమ్మకాన్ని రెట్టింపు చేస్తోంది. నెట్‌ఫ్లిక్స్ అంటే గ్లోబల్ రీచ్ ఉంటుంది. కంటెంట్ బాగుంటే.. 'ఆర్ఆర్ఆర్' బాటలో 'పెద్ది' కూడా పయనించి.. మరోసారి చరణ్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయేలా చేస్తుంది అనడంలో సందేహం లేదు.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.