English | Telugu

ఎన్టీఆర్ కాదు.. బుచ్చిబాబు 'పెద్ది'లో రామ్ చరణ్!

'ఉప్పెన'(2021)తో దర్శకుడిగా పరిచయమై మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న బుచ్చిబాబు.. తన రెండో సినిమాని జూనియర్ ఎన్టీఆర్ తోనే చేయాలని చాలాకాలం ఎదురుచూశాడు. అయితే ఎన్టీఆర్ ఇప్పటికే తన 30వ సినిమాని కొరటాల శివతో, 31వ సినిమాని ప్రశాంత్ నీల్ తో ప్రకటించాడు. కానీ కొన్ని కారణాల వల్ల 'ఎన్టీఆర్ 30' ఆలస్యమవుతూ వస్తోంది. ఎన్టీఆర్ చేస్తున్న ఈ రెండు సినిమాలు పూర్తి కావాలంటే కనీసం రెండేళ్లు పడుతుంది. అందుకే బుచ్చిబాబు, రామ్ చరణ్ తో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్టు ఇటీవల వార్తలొచ్చాయి. అయితే ఆ వార్తలు నిజమేనని, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు.

ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తన 15వ సినిమాని చేస్తున్నాడు చరణ్. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ సగం పూర్తయింది. అలాగే తన 16వ సినిమాని 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేస్తున్నట్టు ప్రకటించాడు చరణ్. కానీ ఏవో కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ని పక్కనపెట్టాడు. ఇక ఇప్పుడు బుచ్చిబాబు డైరెక్షన్ లో మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇదే చరణ్ చేయబోయే 16వ సినిమా అని ప్రచారం జరుగుతోంది.

ఎన్టీఆర్ కోసం బుచ్చిబాబు 'పెద్ది' అనే పవర్ ఫుల్ స్పోర్ట్స్ డ్రామాను రాశాడు. ఇప్పుడు అదే కథను చరణ్ కి వినిపించగా ఆయన వెంటనే ఓకే చెప్పినట్టు సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ కి సన్నిహితుడు సతీష్ కిలారు ఈ చిత్రంతో నిర్మాతగా మారనున్నారని టాక్. రూ.150 కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో ఈ మూవీ రూపొందనుందని న్యూస్ వినిపిస్తోంది.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.