English | Telugu

ర‌జ‌నీ రూ.50 కోట్లు తీసుకొన్నాడా?

ద‌క్షిణాదిన తిరుగులేని క‌థానాయ‌కుడు ర‌జ‌నీకాంత్! ఒక విధంగా చెప్పాలంటే భార‌తీయ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లోనే అత్య‌ధిక పారితోషికం తీసుకొనే క‌థానాయ‌కుల‌లో ర‌జ‌నీ పేరు ముందు వ‌రుస‌లో ఉంటుంది. ఆయ‌న సినిమాకి అంతులేని క్రేజ్‌. దేశ విదేశాల్లోనూ భారీ ఓపెనింగ్స్ రాబ‌ట్టుకొంటాయి. అందుకే ర‌జ‌నీ పారితోషికం కూడా క‌ళ్లు చెదిరే రేంజ్‌లో ఉంటుంది. లింగ‌కు ఆయ‌న అందుకొన్న పారితోషికం ప‌రిశ్ర‌మ వ‌ర్గాల్లో చ‌ర్చ‌ను లేవ‌నెత్తింది. అంద‌రినీ షాక్‌కి గురిచేసింది. ఈ సినిమా కోసం ర‌జ‌నీ ఏకంగా రూ.50 కోట్లు తీసుకొన్నార్ట‌. ఈ లెక్క‌న భార‌త‌దేశంలోనే అత్య‌ధిక పారితోషికం ర‌జ‌నీదే అని చెన్నై ఫిల్మ్‌వ‌ర్గాలు చెబుతున్నాయి. సాధార‌ణంగా ర‌జ‌నీ పారితోషికానికి ఓ లెక్క ఉంటుంది. ఓవ‌ర్సీస్‌, శాటిలైట్ ల‌తో పాటు ఒక‌ట్రెండు ఏరియాల హ‌క్కుల్ని ర‌జ‌నీ త‌న ద‌గ్గ‌రే ఉంచుకొంటారు. అయితే ఈసారి న‌గ‌దు రూపంలో పారితోషికం తీసుకొన్నార‌ని, అది రూ.50 కోట్ల‌ని చెన్నై వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాని ఏరోస్ ఇంటర్నేష‌న‌ల్ వాళ్లు రూ.160 కోట్ల‌కు కొనుగోలు చేయ‌డం విశేషం. ర‌జ‌నీ సినిమా స్టామినా అది. అందుకే ర‌జ‌నీకి రూ.50 కోట్ల పారితోషికం ఇవ్వ‌డంలో త‌ప్పేం లేద‌ని ఆయ‌న అభిమానులు గ‌ర్వంగా చెప్పుకొంటున్నారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.