English | Telugu

సౌందర్యకు హ్యాట్సాఫ్ చెప్పిన రజనీ

రజనీకాంత్ కథానాయకుడిగా రూపొందిన చిత్రం "కొచ్చడయాన్". తెలుగులో "విక్రమసింహ". ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం నిన్న చెన్నైలో జరిగింది. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ ముఖ్య అతిధిగా విచ్చేసారు. తొలి సీడీని రజనీ ఆవిష్కరించి, షారుక్ కి అందజేసారు. ఈ సందర్భంగా రజనీ మాట్లాడుతూ... నేను ఇప్పటివరకు 150పై చిలుకు చిత్రాల్లో నటించాను. అయితే చారిత్రక నేపధ్యమున్న చిత్రంలో నటించలేదు. అయితే ఆ లోటు నా కూతురు సౌందర్య ద్వారా భర్తీ అయ్యింది. ఈ సినిమా గురించి మొదట్లో నేను చాలా కంగారుపడ్డాను. ఇలాంటి సినిమాలకు దాదాపు ఐదేళ్ళ సమయం, దాదాపు రూ.700 కోట్ల వరకు అవుతుందని నా మిత్రుల ద్వారా తెలుసుకొని సౌందర్యను అడిగితే..."లేదు నాన్నా..ఏడాదిన్నరలో చేసేస్తా. నాకు ఆ నమ్మకం ఉంద"ని చెప్పింది. దేశంలో ఎవరు చేయని సాహసం మా అమ్మాయి చేస్తోంది. హ్యాట్సాఫ్. నా కూతుళ్ళు ఇద్దరూ దర్శకత్వం చేస్తున్నారు. వారిని ప్రోత్సహిస్తున్న నా అల్లుళ్ళకు కృతజ్ఞతలు. సౌందర్య చాలా సినిమాలకు దర్శకత్వం వహించి ఉన్నత స్థితికి వెళ్ళాలి. ఈ చిత్రంలోని సాంకేతికతను చూసి అందరూ ఆశ్చర్యపోతారు" అని అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకులు కె.బాలచందర్, శంకర్, కె.ఎస్. రవికుమార్, దీపికా పదుకునే, ఏ.ఆర్.రెహమాన్, చంద్రబోస్ తదితరులు పాల్గొన్నారు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.