English | Telugu

ఇతనికోసం దర్శకులు కొత్త పాత్రలు సృష్టిస్తారట

ప్రముఖ నటుడు రాజశేఖర్ కు ప్రస్తుతం మంచి రోజులు వచ్చాయని ఆనందంగా ఉన్నారు. ప్రస్తుతం తాను చేస్తున్న సినిమాల గురించి మాట్లాడుతూ... "మహంకాళి తర్వాత మూడేళ్ళపాటు మరొక సినిమా చేయలేకపోయాను. చాలా కథలు విన్నాను కానీ ఏది కలిసి రాలేదు. ఇటీవల మాత్రం అన్నీ బాగా కుడురుతున్నాయి. నెలకి ఒకటి చొప్పున వరుసగా మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇకపై దర్శకులు నా గురించి కొత్త తరహ పాత్రలు సృష్టిస్తారన్న నమ్మకం ఉంది. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "పట్టపగలు" చిత్రంలో మంచి పాత్రలో నటించాను. జూన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే "వందకి వంద" చిత్రం కూడా త్వరలోనే రాబోతుంది. అదే విధంగా తాజాగా "గడ్డం గ్యాంగ్" అనే చిత్రం ప్రారంభించాము. ఇది కూడా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది" అని అన్నారు.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.