English | Telugu

పెద్దగా లేవంటూ రాధిక ఆప్టేపై బాడీ షేమింగ్!

బాడీ షేమింగ్ గురించి ఎక్క‌డో ఓ చోట ఎవ‌రో ఒక‌రు మాట్లాడుతూనే ఉన్నారు. ఇంకాస్త ముక్కు బావుండాల్సింది. వ‌క్షోజాలు ఇంకా పెద్ద‌గా ఉండాల్సింది అంటూ రాధిక ఆప్టేను కెరీర్ స్టార్టింగ్‌లో ప‌లువురు విమ‌ర్శించార‌ట‌. ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో న‌ట‌న‌కు ప్రాధాన్య‌మున్న పాత్ర‌ల్లో ఎక్కువ‌గా న‌టిస్తున్నారు రాధికా ఆప్టే. బోల్డ్ రోల్స్ చేయ‌డంలోనూ ఆమెకు ఆమెనే సాటి. లేటెస్ట్ గా మిసస్ అండ‌ర్‌క‌వ‌ర్‌లో న‌టించారు రాధిక‌. త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది ఈ సినిమా. ఇండ‌స్ట్రీలో నిల‌దొక్కుకున్న త‌ర్వాత బాగానే ఉంది కానీ, స్టార్టింగ్‌లో మాత్రం చాలా విమ‌ర్శ‌లు ఎదుర్కోక‌త‌ప్ప‌లేద‌ని అంటున్నారు రాధికా ఆప్టే. మిగిలిన హీరోయిన్ల‌లాగా త‌న‌కూ అలాంటి చేతు ఎక్స్ పీరియ‌న్స్ ఉంద‌ని అన్నారు. `కొంద‌రి పర్‌సెప్ష‌న్స్ చాలా స్ట్రేంజ్‌గా ఉంటాయి. చాలా కాలం వ‌ర‌కు ప‌ల్లెటూరి పాత్ర‌లుంటేనే న‌న్ను పిలిచేవారు. బ‌ద్లాపూర్‌లో నా యాక్టింగ్ చూసిన త‌ర్వాత అప్ప‌టిదాకా ఉన్న అప్రోచ్ మారింది. బద్లాపూర్ త‌ర్వాత సెక్స్ కామెడీలుంటే పిలుపు వ‌చ్చేది. ముందు వ‌రుస‌గా చేసేదాన్ని. కానీ త‌ర్వాత దాన్ని కూడా మానేశాను.

నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన వాటికి సింపుల్‌గా య‌స్ చెప్ప‌డం మానేశాను. నేను ఓ పాత్ర‌కు ఉండాల్సిన బ‌రువు క‌న్నా మూడో, నాలుగో కిలోలు ఎక్కువ‌గా ఉన్నాన‌ని న‌న్ను వ‌ద్ద‌న్నారు. కొత్త‌ల్లో వీటి గురించి మాట్లాడాలంటే త‌డ‌బాటుగా ఉండేది. కానీ, గ‌త కొన్నేళ్లుగా అవ‌గాహ‌న పెరుగుతోంది. ప్రాజెక్టులు ముఖ్య‌మా? ఆత్మ‌గౌర‌వం ముఖ్య‌మా? అనేది కూడా ఆలోచించుకోవాల్సిన విష‌యం. నోరు విప్పి మాట్లాడ‌గ‌ల ధైర్యం మ‌హిళ‌ల్లో వస్తున్నందుకు ఆనందంగా ఉంది`` అని అన్నారు. అండ‌ర్‌క‌వ‌ర్ ఆఫీస‌ర్‌గా, ఇల్లాలిగా రెండు షేడ్స్ ఉన్న పాత్ర‌లో మిసెస్ అండ‌ర్‌క‌వ‌ర్‌లో న‌టించారు రాధికా ఆప్టే.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.