English | Telugu

కట్టిపడేస్తున్న 'చెల్లి వినవే' పాట!

సంగీత దర్శకుడిగా, నటుడిగా తమిళ్ తో పాటు తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్ ఆంటోని. ఆయన హీరోగా నటించిన 'బిచ్చగాడు' సినిమా తెలుగులో ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. తన తల్లి ప్రాణాలు కాపాడుకోవడం కోసం బిచ్చగాడిగా మారిన ఓ ధనువంతుడి కథతో రూపొందిన ఈ చిత్రం 2016 మార్చిలో విడుదలై ఊహించని విజయాన్ని అందుకుంది. ఆకట్టుకునే కథాకథనాలతో పాటు, విజయ్ ఆంటోని సంగీతం కూడా సినిమా విజయంలో ప్రధాన పాత్ర పోషించింది. ముఖ్యంగా 'వంద దేవుళ్ళే కలిసొచ్చిన' అంటూ సాగే అమ్మ పాట ఎంతటి ఆదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఇప్పుడు చెల్లి సెంటిమెంట్ తో మరోసారి మ్యాజిక్ చేయడానికి సిద్ధమవుతున్నాడు విజయ్ ఆంటోని.

2016 లో 'బిచ్చగాడు'తో ఆకట్టుకున్న విజయ్.. ఏడేళ్ల తర్వాత 'బిచ్చగాడు-2'తో వస్తున్నాడు. ఈ సినిమాకి దర్శకుడు, సంగీత దర్శకుడు ఆయనే కావడం విశేషం. తాజాగా ఈ చిత్రం నుంచి 'చెల్లి వినవే' అంటూ సాగే వీడియో సాంగ్ విడుదలైంది. విజయ్ స్వరపరిచిన ఈ పాట హృదయాలను హత్తుకునేలా ఉంది. భాష్యశ్రీ సాహిత్యం, అనురాగ్ కులకర్ణి గాత్రం కట్టిపడేస్తున్నాయి. "చెల్లి వినవే, నా తల్లి వినవే.. నీ అన్నను కాను, అమ్మే నేను" అంటూ సాగే పాట ఎంతో హృద్యంగా ఉంది. వీడియో సాంగ్ లో అన్నాచెల్లెళ్లుగా చైల్డ్ ఆర్టిస్ట్ లు మాదేష్, శివణ్య కనిపించారు. స్కూల్ కి వెళ్లాల్సిన వయసులో వారి తల్లిదండ్రులు మరణించడంతో అనాథలైపోతారు. ఇక చెల్లిలి ఆకలి తీర్చడం కోసం అన్న బిచ్చగాడిగా మారతాడు. ఈ సన్నివేశాలు కూడా పాటలాగే కదిలించేలా ఉన్నాయి. ఈ వీడియో సాంగ్ చూస్తుంటే 'బిచ్చగాడు'లో అమ్మ సెంటిమెంట్ తో ఆకట్టుకున్న విజయ్.. ఈసారి 'బిచ్చగాడు-2'లో చెల్లెలి సెంటిమెంట్ తో కట్టిపడేయడం ఖాయమనిపిస్తోంది. ఈ వేసవిలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.