English | Telugu

బాలయ్యకి రచ్చ రవి దసరా దావత్.. ఇదెక్కడి ప్రేమరా మావ!

నటసింహం నందమూరి బాలకృష్ణకి ఎందరో అభిమానులు ఉన్నారు. వారిలో సినీ సెలబ్రిటీలు కూడా ఉంటారు. కమెడియన్ రచ్చ రవికి బాలయ్య అంటే ఎంతో అభిమానం. తాజాగా 'భగవంత్ కేసరి' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో రచ్చ రవి స్పీచ్ కి, బాలయ్య మీద చూపించిన ప్రేమకి.. బాలయ్యతో పాటు ఆయన అభిమానులు కూడా ఫిదా అయ్యారు.

బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'భగవంత్ కేసరి'. కాజల్ అగర్వాల్, శ్రీలీల ముఖ్య పాత్రలు పోషించిన ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 8న వరంగల్ లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకలో రచ్చ రవి స్పీచ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

"నాకు రాజులు ఎలా ఉంటారో తెలీదు కానీ సినీ పరిశ్రమలో నేను చూసిన రాజు మాత్రం బాలయ్య బాబే. రాజు అంటే రాజ్యం ఉన్నోడో, బలగం ఉన్నోడో కాదు.. ధైర్యాన్ని ఇచ్చేవాడు, బలాన్ని ఇచ్చేవాడు, శక్తిని ఇచ్చేవాడు. బాలయ్య ఉంటే ప్రొడ్యూసర్లకి, డిస్ట్రిబ్యూటర్లకి అందరికీ ధైర్యంగా ఉంటుంది. బాలయ్య మంచి మనసున్న వ్యక్తి. ఆయన నా రాముడు, నా చిన్ని కృష్ణుడు. మా అమ్మ బాలయ్యని ఇంటికి తీసుకురా తలకాయ కూర వండి పెడదాం అన్నది. బాలయ్య బాబు మన ఇంటికి వస్తాడా అన్న. మా అమ్మ బాలయ్య కోసం తలకాయ కూర, బోటీ కూర అన్నీ వండుకొని వచ్చింది. అన్నకి దసరా దావత్ నాతోనే షురూ" అంటూ రచ్చ రవి తన తల్లిదండ్రులను బాలకృష్ణ దగ్గరకు తీసుకొని వెళ్ళి, బాలయ్య కోసం ప్రత్యేకంగా వండుకొని తెచ్చిన ఫుడ్ ని అందించాడు. ఆ సమయంలో బాలయ్య ఎంతో సంతోషంగా కనిపించాడు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.