English | Telugu

కళ్యాణ్ తో పూరి సినిమా లేదంట...!

"హార్ట్ ఎటాక్" చిత్రం తర్వాత ఎవరితో సినిమా చేయాలో తెలియక అయోమయంలో ఉన్నాడు దర్శకుడు పూరి జగన్నాథ్. మహేష్ ప్రస్తుతం మహేష్ "ఆగడు", ఎన్టీఆర్ "రభస", బన్నీ"రేసు గుర్రం", విష్ణు "టెన్షన్ టెన్షన్", చరణ్- కృష్ణవంశీ సినిమాలతో బిజీగా ఉన్నారు. వీరి సినిమాల తర్వాత చాలా మంది డైరెక్టర్లు క్యూలో ఉన్నారు. అందుకే పూరి తన తదుపరి చిత్రం హీరో కళ్యాణ్ రామ్ తో చేయబోతున్నాడని వార్తలు వస్తున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే ఈ వార్తలపై పూరి స్పందిస్తూ.."కళ్యాణ్ రామ్ తో ఇంకా సినిమా అనుకోలేదు. అసలు మేమిద్దరం ఇంకా కలుసుకోలేదు. కాబట్టి అలాంటిదేం లేదు" అని చెప్పడంతో పాటుగా త్వరలోనే మహేష్ తో మళ్ళీ ఓ సినిమా చేయబోతున్నట్లు తెలిపారు. మరి పూరి ప్రస్తుతం ఎవరి సినిమా కోసం కథ సిద్ధం చేస్తున్నాడో మరికొద్ది రోజుల్లోనే తెలియనుంది.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.