English | Telugu

నో హెల్త్..ఓన్లీ రిస్క్.. ప్రిన్స్

"దూకుడు" వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం తర్వాత శ్రీనువైట్ల, మహేష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం "ఆగడు".ఇటీవలే మహేష్ కు షూటింగ్ సమయంలో గాయాలు తగిలిన విషయం తెలిసిందే. అయితే కొద్దిరోజులు మాత్రమే విశ్రాంతి తీసుకొని, మళ్ళీ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాదులో జరుగుతుంది. హీరో, విలన్లకు మధ్య జరిగే పోరాట సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఆ తర్వాత రామోజీఫిల్మ్ సిటీలో కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తారు. ఈనెలాఖరు వరకు అక్కడే షూటింగ్ జరగనుంది. ఏప్రిల్ నుంచి గుజరాత్ లో షూటింగ్ జరుపుకోనుందని చిత్ర యూనిట్ తెలిపారు. ఇందులో మహేష్ రాయలసీమ యాసలో మాట్లాడుతూ ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ పాత్రలో నటిస్తున్నాడు. తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. 14 రీల్స్ బ్యానర్లో అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపి ఆచంటలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న పాటలను కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మే 31 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.