English | Telugu
నో హెల్త్..ఓన్లీ రిస్క్.. ప్రిన్స్
Updated : Mar 12, 2014
"దూకుడు" వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం తర్వాత శ్రీనువైట్ల, మహేష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం "ఆగడు".ఇటీవలే మహేష్ కు షూటింగ్ సమయంలో గాయాలు తగిలిన విషయం తెలిసిందే. అయితే కొద్దిరోజులు మాత్రమే విశ్రాంతి తీసుకొని, మళ్ళీ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాదులో జరుగుతుంది. హీరో, విలన్లకు మధ్య జరిగే పోరాట సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఆ తర్వాత రామోజీఫిల్మ్ సిటీలో కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తారు. ఈనెలాఖరు వరకు అక్కడే షూటింగ్ జరగనుంది. ఏప్రిల్ నుంచి గుజరాత్ లో షూటింగ్ జరుపుకోనుందని చిత్ర యూనిట్ తెలిపారు. ఇందులో మహేష్ రాయలసీమ యాసలో మాట్లాడుతూ ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ పాత్రలో నటిస్తున్నాడు. తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. 14 రీల్స్ బ్యానర్లో అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపి ఆచంటలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న పాటలను కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మే 31 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.