English | Telugu

ఆమెను చూసి అసూయ పడిన దీపిక

హిందీలో కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన "క్వీన్" సినిమా ఇటీవలే విడుదలైంది. బాలీవుడ్ లో ప్రస్తుతం ఈ సినిమా హాట్ టాపిక్ గా మారింది. హిందీలో విడుదలైన ఈ సినిమా మంచి కలెక్షన్లతో, సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. అయితే ఈ సినిమాను ఇటీవలే బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకునే చూసిందట. ఈ సినిమా చూసిన తర్వాత అందులో నటించిన కంగనాని చూస్తే దీపికాకి అసూయగా ఉందని తెలిపింది. ఎందుకంటే ఈ సినిమాలో కంగనా అధ్బుతంగా నటించింది. ఆమె నటన చూసి నాకు చాలా అసూయ కలిగింది. చిత్ర దర్శకుడు వికాస్ మహిళల భావోద్వేగాలను చాలా చక్కగా తెరక్కించాడు" అంటూ ప్రశంసల వర్షం కురిపించింది. మరి ఏదేమైనా బాలీవుడ్ లో ప్రస్తుతం టాప్1 హీరోయిన్ గా ఉన్న దీపిక ఇలా మరో సినిమా గురించి గొప్పగా చెప్పడం తన సంస్కారానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.