English | Telugu

తెలంగాణ సీఎం అభ్యర్థి సినిమా

సినిమాలకి రాజకీయాలకి విడదీయరాని అనుబంధం ఉంది. తెలుగు సినిమా పుట్టినప్పటినుంచి
చాలా మంది రాజకీయ నాయకుల బయోపిక్ లు వచ్చాయి. ఇప్పటికి వస్తూనే ఉన్నాయి. తాజాగా తెలంగాణ కి సంబంధించిన ఒక నాయకుడి బయోపిక్ తో ఒక సినిమా రాబోతుంది. తెలంగాణాలో వచ్చేనెల నవంబర్ చివరలో ఎన్నికలు జరగబోతున్నాయి. మరి ఈ టైం లో తెరకెక్కుతున్న తెలంగాణ నాయకుడి బయోపిక్ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ తెలంగాణాలో కాకలు పుట్టిస్తుంది.

నంద కిషోర్ ,రోజా హీరో హీరోయిన్లు గా దుర్గా నాయుడు దర్శకత్వం లో తెరకెక్కుతున్న సినిమా ప్రవీణ్ ఐ.పి.ఎస్. ఈ చిత్రం ప్రస్తుత బహుజన సమాజ్ వాది పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతుంది. తాజాగా ఆ మూవీ కి సంబంధించిన టీజర్ ని చిత్ర బృందం విడుదల చేసింది. బహుజనులు బానిసలు కాదని వాళ్లకి వెయ్యి ఏనుగుల బలాన్ని ఇచ్చే ఒక వ్యక్తి రాబోతున్నాడని సాగిన టీజర్ లో ప్రవీణ్ కుమార్ ని ఫుల్ గా ఎలివేట్ చేసారు. సినిమా కూడా సరిగ్గా ఎన్నికలకి కొన్ని రోజుల ముందే విడుదల కాబోతుంది.

ఐపిఎస్ ఆఫీసర్ గా చేసి రిటైర్ అయిన ప్రవీణ్ కుమార్ తెలంగాణాలో ఉన్న బడుగు బలహీన వర్గాల కోసం పోరాడుతూ తెలంగాణాలో అధికారమే లక్ష్యంగా బహుజన సమాజ్ వాది పార్టీ లో చేరారు. మరి ఇప్పుడు తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకున్న వేళ ప్రవీణ్ ఐ.పి ఎస్ సినిమా ఎలాంటి సంచలనాన్ని సాధిస్తుందో చూడాలి. ఈ సినిమాకి నీల మామిడాల నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.