English | Telugu

ప్రభాస్ కొత్త సినిమాకి 50 డేస్ లో సెలబ్రేషన్స్ స్టార్ట్

ఒక సినిమా అర్ధ శతదినోత్సవాన్ని(50 డేస్ ) జరుపుకుంటే ఆ సినిమా మేకర్స్ మా సినిమా 50 రోజులు జరుపుకుందని వాల్ పోస్టర్స్ వేయించడం సహజం. కానీ ఒక సినిమాకి మాత్రం రిలీజ్ అవ్వకుండానే నిర్మాతలు 50 డేస్ వాల్ పోస్టర్ ని వేయించారు. అదెలా అని అంటారా?
ప్రభాస్ నుంచి వస్తున్న తాజా మూవీ సలార్. యావత్తు భారతం మొత్తం సలార్ మూవీ కోసం ఫుల్ వెయిటింగ్ లో ఉంది. ఈ సినిమా ఇంకో 50 రోజుల్లో విడుదల కాబోతుంది. ఈ రోజు నుంచి సరిగ్గా ఇంకో యాభై రోజుల్లో అంటే డిసెంబర్ 22 న సలార్ ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల కాబోతుంది. మీ క్యాలెండర్ లో డిసెంబర్ 22 డేట్ కి మార్క్ పెట్టుకోండి అంటూ చిత్ర బృందం సరికొత్త రీతిలో ఎక్స్ వేదికగా సలార్ గురించి పబ్లిసిటీ ఇస్తుంది. సలార్ ఇంకో 50 రోజుల్లో రానుంది అంటూ నిర్మాతలు సలార్ 50 డేస్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. ప్రభాస్ ఫాన్స్ కూడా 50 డేస్ లో సలార్ రాబోతుందంటూ వేడుకలు చేస్తున్నారు.

ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ మూవీ లో ప్రభాస్ సరసన శృతిహాసన్ జతకట్టింది.హోంబిలే ఫిలిమ్స్ పతాకంపై విజయ్ కిరంగదుర్ నిర్మాణ సారధ్యంలో సుమారు 250 కోట్ల భారీ బడ్జట్ తో సలార్ మూవీ నిర్మాణం జరుపుకుంది. సలార్ కి సంబంధించి ప్రభాస్ ఫాన్స్ హడావిడి కూడా స్టార్ట్ అయ్యింది.లేటెస్ట్ గా జరిగిన ప్రభాస్ బర్త్ డే వేడుకల్ని కూడా చాలా గ్రాండ్ గా నిర్వహించి ప్రభాస్ భారీ కటౌట్ లని కూడా ఏర్పాటు చేసారు. మొత్తానికి ఇంకో యాభై రోజుల్లో సలార్ వరల్డ్ వైడ్ గా సందడి చేయనుంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.