English | Telugu

ప్రభాస్, అనుష్క పెళ్ళి.. వైరల్ గా మారిన వీడియో!

ప్రభాస్(Prabhas), అనుష్క(Anushka) జోడి తెరపై చూడటానికి చాలా బాగుంటుంది. నిజ జీవితంలో మంచి స్నేహితులు కూడా. అందుకే వీరు పెళ్ళి చేసుకుంటే చూడాలని కోరుకునే అభిమానులు ఎందరో ఉన్నారు. అయితే అభిమానుల కోరిక మాత్రం తీరేలా కనిపించడంలేదు. ఇలాంటి సమయంలో ఒక వీడియో ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషీ చేస్తోంది. ఇంతకీ ఆ వీడియో ఏంటి..?

ప్రస్తుతం ఏఐ హవా నడుస్తోంది. కొందరు దీనిని చెడుకి ఉపయోగిస్తుంటే, మరికొందరు మాత్రం దానితో అందమైన జ్ఞాపకాలను సృష్టిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఒకరు ప్రభాస్-అనుష్క పెళ్ళి అయినట్లుగా ఒక వీడియోని క్రియేట్ చేశారు.

ఈ ఏఐ వీడియోలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పురోహితుడిగా కనిపిస్తున్నారు. వివిధ పరిశ్రమలకు చెందిన సినీ తారలు తరలివచ్చినట్టుగా చూపించారు. రామ్ చరణ్ డోలు కొట్టడం, మహేష్ బాబు-పవన్ కళ్యాణ్ సరదా కబుర్లు, రాజమౌళి-కీరవాణి డ్యాన్స్ చేయడం, కొరియన్ నటుడు డాన్ లీకి బాలకృష్ణ వడ్డించడం వంటివి వీడియోలో హైలైట్ గా నిలిచాయి. ఇక చివరిలో ప్రభాస్-అనుష్కలను కృష్ణంరాజు దీవించడం హృదయాన్ని హత్తుకుంది.

Also Read: మరో తమిళ స్టార్ డైరెక్టర్ తో అల్లు అర్జున్ మూవీ!

ఇన్ స్టాగ్రామ్ లో ఈ వీడియో వైరల్ గా మారింది. ప్రభాస్ పెళ్ళి చూడాలన్న కోరిక తీరిపోయింది అంటూ అభిమానులు మురిసిపోతున్నారు.

ఇక ఈ వీడియో చూసి ఆశ్చర్యపోయిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ "ఏంటిది ఏఐ" అంటూ ట్విట్టర్ లో షేర్ చేశారు. దీంతో మరింత వైరల్ అవుతోంది.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.