English | Telugu

'గోపాల గోపాల' రెస్ట్ తీసుకుంటున్నాడు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా గోపాల గోపాల మూవీ షూటింగ్ బిజీగా గడిపాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రముఖ భాగం చిత్రీకరణ పూర్తికావడంతో కొన్ని రోజులు విరామం తీసుకోవాలనుకుంటున్నాడు. కామన్ గా పవన్ కళ్యాణ్ ఏదైనా మూవీ షూటింగ్ అయిపోయిన వెంటనే ఫారిన్ కి వెళ్ళి కొంత కాలం అక్కడ విశ్రాంతి తీసుకోవడం ఆయనకి అలవాటు. అయితే ఈసారి రాజకీయాల్లోకి రావడం వల్ల ఇండియాలోనే వుండాలని నిర్ణయించుకున్నాడు. ప్రస్తుతం ఆయన బెంగుళూరులో రెస్ట్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అందుకే ఆయన తెలంగాణ సమగ్ర సర్వేలో కూడా పాల్గొనలేదని సన్నీహితులు అంటున్నారు.మరో వైపు గబ్బర్ సింగ్2 మూవీకి సంబంధించిన ప్రి ప్రొడక్షన్ వర్క్స్ ని మొదలు పెట్టారట. గబ్బర్ సింగ్ 2 కూడా త్వరగా కంప్లీట్ చేసి క్రియాశీల రాజకీయాలలోకి రావాలని పవన్ ఆలోచన.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.