English | Telugu

కోటీశ్వరుడు కాబోతున్నరామ్

‘మసాలా’ చిత్రం తర్వాత రామ్ తాజాగా ఓకే చెప్పి న చిత్రం ‘పండగ చేస్కో’. ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లో ప్రారంభమైంది. ఏడాది విరామం తర్వాత రామ్ చేస్తున్నఈ సినిమా కథా రచయిత వెలిగొండ శ్రీనివాస్. మసాల చిత్రానికి ముందే ఈ కథ విన్న రామ్ కి, కథ ఈ ఎంతగానో నచ్చిందన్నారు. థియేటర్ కి వచ్చిన ఎవరైనా ఈ సినిమా చూసిన తర్వాత తప్పకుండా బాగుందనే చెప్తారని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు రామ్.
ఇక కథా రచయిత వెలిగొండ శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈ కథ రామ్ కోసమే రాసిన కథ అని, ఓ కోటీశ్వరుడు భారతదేశం వచ్చి ఏం చేశాడు? అనేదే ఈ చిత్రకథ అని చెప్పారు.
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రామ్, రకుల్‌ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రన్నిపరుచూరి కిరీటి నిర్మిస్తున్నారు.


శనివారం ప్రారంభమైన ఈ షూటింగ్ ముహూర్తానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు కెమెరా స్విచాన్ చేశారు. ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ క్లాప్ ఇవ్వగా, ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను గౌరవ దర్శకత్వం వహించారు. ఆ తర్వాత దర్శకుడు మాట్లాడుతూ రామ్ ఎనర్జీ మొత్తం ఈ సినిమాలో కనిపిస్తుందని, ‘బలుపు’ తర్వాత కొంత సమయం తీసుకున్నా మంచి కథ కుదిరిందన్నారు. ఈ చిత్రంలో జగపతిబాబు ఒక ముఖ్యమైన పాత్రలో కనిపిస్తారన్నారు.
గోపీచంద్, రామ్‌లతో ముచ్చటగా మూడో సారి పనిచేస్తున్నాని ఈ సినిమా తప్పకుండా హ్యాట్రిక్ సాధిస్తుందని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అన్నారు. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే-మాటలు: కోన వెంకట్, రచనా సహకారం: అనిల్ రావిపూడి.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.