English | Telugu

ఓజీ బర్త్ డే గ్లింప్స్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని నిరాశపరిచిన సుజీత్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అప్ కమింగ్ మూవీ 'ఓజీ'. సుజీత్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న ఈ గ్యాంగ్ స్టర్ మూవీపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. సెప్టెంబర్ 25న థియేటర్లలో అడుగుపెట్టనున్న ఈ మూవీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా తాజాగా 'ఓజీ' నుంచి స్పెషల్ గ్లింప్స్ విడుదలైంది. (Pawan Kalyan)

“HBD OG - LOVE OMI” పేరుతో గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో 'ఓజాస్‌ గంభీర' అనే శక్తివంతమైన పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు చేయనుండగా.. 'ఓమి భావు' అనే ప్రతినాయక పాత్రలో బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఓజీకి ఓమి బర్త్ డే విషెస్ తెలిపినట్లుగా ఈ గ్లింప్స్ ను రూపొందించారు. "డియర్ ఓజీ. నిన్ను కలవాలని, నీతో మాట్లాడాలని, నిన్ను చంపాలని ఎదురుచూస్తున్న నీ ఓమి. హ్యాపీ బర్త్ డే ఓజీ" అంటూ ఓమి కోణంలో ఈ గ్లింప్స్ సాగింది. పవన్ ని ఢీ కొట్టే పవర్ ఫుల్ రోల్ లో ఇమ్రాన్ హష్మీ కనిపిస్తున్నాడు. ఇక గ్లింప్స్ చివరిలో మారణహోమం సృష్టించి.. ఒంటి మీద నెత్తుటి మరకలతో, చేతిలో కత్తి పట్టుకొని ఉన్న పవన్ కళ్యాణ్ షాట్ అదిరిపోయింది. (They Call Him OG)

'ఓజీ' నుంచి తాజాగా విడుదలైన గ్లింప్స్ ఆకట్టుకున్నప్పటికీ.. పవన్ ఫ్యాన్స్ లో మాత్రం కాస్త నిరాశ కనిపిస్తోంది. ఎందుకంటే, పవన్ బర్త్ డే గ్లింప్స్ కాబట్టి.. ఎక్కువగా ఆయన్నే చూపిస్తారని ఫ్యాన్స్ భావించారు. కానీ, ఇమ్రాన్ హష్మీ కోణంలో గ్లింప్స్ ని రూపొందించడంతో.. పవన్ ని ఎక్కువసేపు చూసే అవకాశం రాలేదని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఫ్యాన్స్ నిరాశ చెందాల్సిన అవసరంలేదని, ట్రైలర్ కోసం సుజీత్ అద్భుతమైన కంటెంట్ దాచాడని.. ఆ ట్రైలర్ తో అందరూ సంతృప్తి చెందుతారని ఇన్సైడ్ టాక్.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.