English | Telugu

ఓజీ మూవీ వాయిదా.. క్లారిటీ వచ్చేసింది..!

ఇటీవల 'హరి హర వీరమల్లు'తో ప్రేక్షకులను పలకరించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. సెప్టెంబర్ 25న 'ఓజీ'తో థియేటర్లలో సందడి చేయనున్నారు. సుజీత్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ సినిమాని ఎప్పుడెప్పుడు చూస్తామా అని అభిమానులతో పాటు, సాధారణ ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 'ఓజీ' విడుదలకు ఇంకా నెలరోజులే సమయముంది. ఇలాంటి సమయంలో ఈ చిత్రం వాయిదా పడనుందంటూ ప్రచారం మొదలైంది. అయితే ఈ ప్రచారానికి తాజాగా మేకర్స్ చెక్ పెట్టారు. (Pawan Kalyan)

సెప్టెంబర్ 25నే 'ఓజీ' విడుదలవుతుందని, నెల రోజుల్లో బాక్సాఫీస్ ని షేక్ చేయడానికి వస్తుందని తాజాగా మేకర్స్ స్పష్టం చేశారు. అంతా లాక్ అయిందని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయని పేర్కొన్నారు. అంతేకాదు.. ఆగస్టు 29 నుండి యూఎస్ఏ బుకింగ్స్ ఓపెన్ అవుతాయని, రికార్డ్ బ్రేకింగ్ ఓపెనింగ్స్ ఖాయమని నిర్మాతలు నమ్మకం వ్యక్తం చేశారు. (OG Movie)

మేకర్స్ తాజా ప్రకటనతో 'ఓజీ' వాయిదా పడట్లేదని, ముందుగా ప్రకటించినట్టుగా సెప్టెంబర్ 25నే విడుదలవుతుందని క్లారిటీ వచ్చేసింది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.