English | Telugu

సుందరకాండ మూవీ ఫస్ట్ రివ్యూ!

విభిన్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నారా రోహిత్.. ఈ ఏడాది ఇప్పటికే 'భైరవం' సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. వినాయక చవితి కానుకగా రేపు(ఆగస్టు 27) 'సుందరకాండ'తో థియేటర్లలో అడుగు పెట్టబోతున్నాడు. ఈ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్.. ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఇండస్ట్రీ వర్గాల్లోనూ ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది.

నారా రోహిత్ కెరీర్ లో 'సోలో', 'జో అచ్యుతానంద' వంటి రొమాంటిక్ కామెడీ ఫిలిమ్స్ ఉన్నాయి. ముఖ్యంగా 'సోలో' మూవీ రోహిత్ కెరీర్ లో బిగ్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు 'సుందరకాండ' ప్రచార చిత్రాల్లోనూ ఆ వైబ్ కనిపించింది. అందుకు తగ్గట్టే సెన్సార్ రిపోర్ట్ పాజిటివ్ గా ఉంది. ఇండస్ట్రీ సర్కిల్స్ లోనూ సినిమా గురించి పాజిటివ్ గా చెబుతున్నారు. పెళ్ళి కాని ప్రసాద్‌ తరహా పాత్రలో రోహిత్ చక్కగా ఒదిగిపోయాడట. నరేష్, సత్య, అభినవ్ గోమఠంతో కలిసి నవ్వులు పూయించాడని అంటున్నారు. లవ్ ట్రాక్ కూడా ఆకట్టుకునేలా ఉందట. రొమాన్స్, కామెడీనే కాదు.. ఎమోషన్ కూడా వర్కౌట్ అయిందని టాక్.

ఇటీవల కాలంలో ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్లకు రప్పించే క్లీన్ ఎంటర్టైనర్స్ పెద్దగా రావట్లేదనే చెప్పాలి. 'సుందరకాండ' పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే.. ఆ లోటుని భర్తీ చేసే అవకాశముంది. మరి విడుదలకు ముందు ఇండస్ట్రీ వర్గాల్లో పాజిటివ్ టాక్ ని తెచ్చుకున్న సుందరకాండ.. విడుదల తర్వాత ప్రేక్షకుల నుంచి కూడా పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంటుందేమో చూడాలి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.