English | Telugu

అనామిక పాటల సందడి

నయనతార ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'అనామిక'. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందించాడు. ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం నిన్న హైదరాబాదులో జరిగింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు మాట్లాడుతూ..."ఇది హిందీలో "కహానీ" పేరుతో విడుదలై మంచి విజయం సాధించిన ఈ చిత్రాన్నీ తెలుగులో రీమేక్ చేయాలంటే కొంచెం భయపడ్డాను. ఎందుకంటే అదే సినిమాను మళ్ళీ తీస్తే జనాలు ఎలా స్పందిస్తారో అనే భయంగా ఉండేది. కానీ ఇదే విషయం గురించి యండమూరి గారిని కలిసిన తర్వాత ఈ కథలో చాలా మార్పులు చేయడం జరిగింది. ఒక థ్రిల్లర్ మూవీ స్టైల్ లో తీయడం జరిగింది. మా చిత్రానికి కీరవాణి గారు సంగీతం అందించడం మాకు చాలా సంతోషంగా ఉంది. వేటూరి గారి తర్వాత నాకు బాగా నచ్చిన వారంటే అది కేవలం సిరివెన్నెల సీతారామశాస్త్రి గారే. ఈ చిత్రంలో నయనతార, వైభవ్ చాలా అధ్బుతంగా నటించారు" అని అన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిరధ మహారధులందరూ కూడా ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరారు. ఈ కార్యక్రమానికి ఎంఎం కీరవాణి, సిరివెన్నెల సీతారామశాస్త్రి , రమేష్ ప్రసాద్, నరేష్, వైభవ్, కోదండరామిరెడ్డిలతో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.