English | Telugu

మెగా ట్రీట్.. 'ఓజీ' లాంటి సినిమాలో చిరంజీవి!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో 'ఓజీ' సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నారు. పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. 'ఓజీ' చిత్రాన్ని బిగ్ స్క్రీన్ పై ఎప్పుడెప్పుడు చూస్తామా అని మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి కూడా తన స్టార్డంకి తగ్గట్టుగా ఈ తరహా గ్యాంగ్ స్టర్ ఫిల్మ్ చేస్తే చూడాలని వారు ఆశపడుతున్నారు. అయితే త్వరలోనే మెగా ఫ్యాన్స్ ఆశ నెరవేరేలా ఉంది.

చిరంజీవి ప్రస్తుతం 'విశ్వంభర'తో పాటు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. అలాగే శ్రీకాంత్ ఓదెలతోనూ ఓ చిత్రాన్ని ప్రకటించారు. ఇవి కాకుండా బాబీ కొల్లి డైరెక్షన్ లో కూడా ఓ ప్రాజెక్ట్ కమిటై ఉన్నారు. గతంలో వీరి కాంబినేషన్ లో 'వాల్తేరు వీరయ్య' వంటి బ్లాక్ బస్టర్ ఫిల్మ్ వచ్చింది. ఆ చిత్రాన్ని యాక్షన్ ఎంటర్టైనర్ గా మలిచాడు బాబీ. అందులో చిరంజీవి కామెడీ టైమింగ్ కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అందుకే భారీ వసూళ్లతో 'వాల్తేరు వీరయ్య' ఘన విజయం సాధించింది.

అయితే ఈసారి బాబీ 'వాల్తేరు వీరయ్య' తరహా ఎంటర్టైనర్ లా కాకుండా.. భారీ గ్యాంగ్ స్టర్ ఫిల్మ్ ను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో చిరంజీవి ఇమేజ్ కి తగ్గట్టుగా భారీ ఎలివేషన్స్, అదిరిపోయే యాక్షన్ సీన్స్ ఉంటాయట. చిరంజీవి నుంచి 'ఓజీ', 'విక్రమ్', 'జైలర్' తరహా సినిమాలను అభిమానులు కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్టే మెగా ఫ్యాన్స్ మెచ్చే సినిమాని రూపొందే పనిలో ప్రస్తుతం బాబీ ఉన్నట్లు సమాచారం.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.